పందుల ఆసామి.. ఆయన 10 లక్షల పైసలు చెదలు తినేసి..

ఓ పందుల ఆసామి.. రెక్కలు ముక్కలు చేసుకొని కష్టపడి సంపాదించిన సంపదంతా చెదలు తినేశాయి. నోరు కట్టుకొని మరీ పనిచేసి ట్రంక్ ఇనుప పెట్టెలో దాచిన సొమ్ము చెదల పాలైంది. ఇప్పుడు నెత్తి నోరు బాదుకుంటున్న వైనం అందరినీ కలిచివేసింది. కృష్ణా జిల్లా మైలవరంలో సొంతింటి కళ నెరవేర్చుకునేందుకు.. బ్యాంకు అంటే తెలియని ఒక పందుల ఆసామి.. ఏకంగా రూ.10 లక్షలు కూడబెట్టాడు. జమలయ్య తన వద్దనున్న డబ్బును ట్రంకు పెట్టెలో దాచిపెట్టాడు. రూ.10లక్షలు పోగుచేసిన అనంతరం […]

Written By: NARESH, Updated On : February 16, 2021 10:11 pm
Follow us on

ఓ పందుల ఆసామి.. రెక్కలు ముక్కలు చేసుకొని కష్టపడి సంపాదించిన సంపదంతా చెదలు తినేశాయి. నోరు కట్టుకొని మరీ పనిచేసి ట్రంక్ ఇనుప పెట్టెలో దాచిన సొమ్ము చెదల పాలైంది. ఇప్పుడు నెత్తి నోరు బాదుకుంటున్న వైనం అందరినీ కలిచివేసింది.

కృష్ణా జిల్లా మైలవరంలో సొంతింటి కళ నెరవేర్చుకునేందుకు.. బ్యాంకు అంటే తెలియని ఒక పందుల ఆసామి.. ఏకంగా రూ.10 లక్షలు కూడబెట్టాడు. జమలయ్య తన వద్దనున్న డబ్బును ట్రంకు పెట్టెలో దాచిపెట్టాడు. రూ.10లక్షలు పోగుచేసిన అనంతరం మంచి ఇల్లు కట్టుకోవాలనుకున్నాడు.

ఇలా సుమారు రూ.5 లక్షలు దాచిపెట్టాడు. అయితే వ్యాపారం కోసం దాచిపెట్టిన డబ్బు నుంచి లక్ష తీసుకునేందుకు పెట్టె తెరిచాడు. పెట్టె లోపల డబ్బును చూసి జమలయ్య ఒక్కసారిగా షాక్ అయ్యాడు.

ట్రంకు పెట్టేలో ఉన్న సొమ్ము మొత్తం చెదలు పట్టి చిత్తుకాగితాలుగా మారడంతో జమలయ్య కుటుంబ సభ్యులంతా బావురుమంటున్నారు. డబ్బంతా చెదలు తినేయడంతో కన్నీరు మున్నీరయ్యారు.

పోలీసులు వెళ్లి ఆరాతీశారు. వారితో తమకు న్యాయం చేయాలని జమలయ్య వేడుకున్నాడు. ఈ ఘటన స్థానికులను కదిలిచింది. వారు అంతో ఇంతో విరాళాలు ఇచ్చారు.