రూ.25 లక్షలతో సోహైల్ లక్కీ.. మెగాస్టార్ ఆఫర్

బిగ్ బాస్ లో విజేతగా అభిజిత్ గెలిచినా అందరి మనసు గెలిచి అటు సగం డబ్బు కూడా గెలిచింది ఎవరైనా ఉన్నారంటే అది సయ్యద్ సోహైల్ మాత్రమే. బిగ్ బాస్ లో యంగ్ టాలెంటెడ్ గాయ్ తన ఆవేశంతో మరో అర్జున్ రెడ్డిగా ప్రేక్షకులను ఉర్రూతలూగించాడు. అలాగే కామెడీని కూడా పండించాడు. బిగ్ బాస్ ఫైనల్ వేళ టాప్ 3గా మిగిలిన అభిజిత్, అఖిల్, సోహైల్ లకు నాగార్జున బిగ్ ఆఫర్ ఇచ్చాడు. రూ.25 లక్షలు తీసుకొని […]

Written By: NARESH, Updated On : December 21, 2020 7:39 am
Follow us on

బిగ్ బాస్ లో విజేతగా అభిజిత్ గెలిచినా అందరి మనసు గెలిచి అటు సగం డబ్బు కూడా గెలిచింది ఎవరైనా ఉన్నారంటే అది సయ్యద్ సోహైల్ మాత్రమే. బిగ్ బాస్ లో యంగ్ టాలెంటెడ్ గాయ్ తన ఆవేశంతో మరో అర్జున్ రెడ్డిగా ప్రేక్షకులను ఉర్రూతలూగించాడు. అలాగే కామెడీని కూడా పండించాడు.

బిగ్ బాస్ ఫైనల్ వేళ టాప్ 3గా మిగిలిన అభిజిత్, అఖిల్, సోహైల్ లకు నాగార్జున బిగ్ ఆఫర్ ఇచ్చాడు. రూ.25 లక్షలు తీసుకొని హౌస్ లోంచి ఒకరు బయటకు రావాలని ఆఫర్ ఇచ్చాడు. తను విజేతగా ఎలాగూ కానని.. అందుకే ఆ రూ.25 లక్షలు తీసుకోవడానికి సయ్యద్ సోహైల్ ఓకే అన్నాడు. ఈ తెలివైన కీలక నిర్ణయం తీసుకున్నందుకు సోహైల్ కు అందరూ హర్షధ్వానాలు చేశారు. చివరకు నాగార్జున కూడా సోహైల్ ను ఎత్తుకోవడం విశేషం.

ఇక సోహైల్ పై బిగ్ బాస్ చీఫ్ గెస్ట్ చిరంజీవి అభిమానం చూపించారు. సోహైల్ కోసం తన ఇంట్లో ప్రత్యేకంగా మటన్ బిర్యానీ తయారు చేయించి బిగ్ బాస్ షోకు తీసుకువచ్చారు.తన ఇంట్లో సోహైల్ కు అభిమానులు ఉన్నారని.. అతడికి ఫ్యాన్ అయిపోయానని అన్నారు.

ఇక సోహైల్ సినిమా తీస్తే అందులో తాను చిన్న పాత్ర చేస్తానని మాట ఇచ్చారు. ఇక వరుసగా మోనాల్, హారిక సహా అందరినీ గుర్తు చేసి చిరంజీవి అలరించారు. మొత్తం ఎపిసోడ్ లో వారు చేసిన పనులు అల్లరి గుర్తు చేశారు. ఇక దివికి తన వేదాళం సినిమాలోని ఓ పోలీస్ క్యారెక్టర్ ను ఆఫర్ చేశాడు. బిగ్ బాస్ ను ప్రతివారం చూస్తున్న చిరంజీవి అందులో ప్రతి సభ్యుడి గురించి మాట్లాడి వారిని అలరించడం విశేషం.