టీఆర్‌ఎస్‌కు ‘దుబ్బాక’ సెగ తగలనుందా..?

సిద్ధిపేట జిల్లా దుబ్బాకలో జరిగిన ఉప ఎన్నిక అసెంబ్లీ ఎన్నికలను తలపించింది. ఇక్కడ ఒక్కస్థానానికే ఎన్నిక జరగగా తెలంగాణ రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల ప్రజలు ఈ ఎన్నికపై ఆసక్తి కనబర్చారు. మొత్తానికి ఈనెల 3న పోలింగ్‌ ప్రశాంతంగా జరగగా ఫలితం కోసం ఎదురుచూస్తున్నారు. కేవలం దుబ్బాక నియోజకవర్గ ప్రజలే కాకుండా రాష్ట్ర ప్రజలు సైతం ఎవరు గెలుస్తారా..? అని ఆత్రుతగా చూస్తున్నారు. అయితే దుబ్బాకకు పోలింగ్‌ నిర్వహించిన తరువాత కొన్ని సంస్థలు ఎగ్జిట్‌ పోల్స్‌ను ప్రకటించాయి. వీటిలో […]

Written By: NARESH, Updated On : November 8, 2020 9:55 am
Follow us on

సిద్ధిపేట జిల్లా దుబ్బాకలో జరిగిన ఉప ఎన్నిక అసెంబ్లీ ఎన్నికలను తలపించింది. ఇక్కడ ఒక్కస్థానానికే ఎన్నిక జరగగా తెలంగాణ రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల ప్రజలు ఈ ఎన్నికపై ఆసక్తి కనబర్చారు. మొత్తానికి ఈనెల 3న పోలింగ్‌ ప్రశాంతంగా జరగగా ఫలితం కోసం ఎదురుచూస్తున్నారు. కేవలం దుబ్బాక నియోజకవర్గ ప్రజలే కాకుండా రాష్ట్ర ప్రజలు సైతం ఎవరు గెలుస్తారా..? అని ఆత్రుతగా చూస్తున్నారు. అయితే దుబ్బాకకు పోలింగ్‌ నిర్వహించిన తరువాత కొన్ని సంస్థలు ఎగ్జిట్‌ పోల్స్‌ను ప్రకటించాయి. వీటిలో ఒక సంస్థతో మరో సంస్థ సంబంధం లేకుండా ప్రకటించాయి. మొత్తంగా మాత్రం బీజేపీకి ఈ ఎన్నిక కలిసొచ్చిందని అర్థమైంది.

మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్

ప్రముఖ సర్వే సంస్థ మిషన్‌ చాణక్య నిర్వహించిన సర్వే ప్రకారం దుబ్బాకలో బీజేపి విజయం సాధిస్తుంది. ఆ పార్టీ అభ్యర్థి రఘునందన్‌రావు 51.82 శాతం ఓట్లతో గెలుపొందుతారు. రెండోస్థానంలో టీఆర్‌ఎస్‌ ఉంటుంది. టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సోలిపేట సుజాతకు 35.67 శాతం ఓట్లు, మూడో స్థానంలో వచ్చే కాంగ్రెస్‌ అభ్యర్థి చెరుకు శ్రీనివాసరెడ్డికి 12.15 శాతం ఓట్లు వస్తాయని తెలిపింది.

Also Read: అప్పుల కుప్ప.. అదే తెలంగాణ గొప్ప..

మరో సంస్థ ‘ఆరా’ నిర్వహించిన సర్వే ప్రకారం టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సోలిపేట సుజాత విజయం సాధిస్తారు. 48.72 శాతం ఓట్లు దక్కుతాయి. రెండో స్థానంలో బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు ఉంటారు. 44.64 శాతం ఓట్లు పడుతాయని తెలిపింది. దుబ్బాక ఫలితం ఎలా ఉన్నా పోటాపోటీగా ఓట్లు పడ్డాయని తెలుస్తోంది. మొదట సాధారణ ఎన్నికనే అనుకున్న టీఆర్‌ఎస్‌కు రానురాను బీజేపీ గట్టి పోటి ఇచ్చింది.

అయితే టీఆర్‌ఎస్‌కు చెందిన హరీశ్‌రావు ఇక్కడ గెలుపు గురించి కాకుండా మెజారిటీ పైనే దృష్టి పెట్టామని ప్రచారం చేశారు. ఎగ్జిట్‌ పోల్స్‌ చూస్తే ఏ సర్వేలో మెజారిటీ కనిపించడం లేదు. బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు బంధువుల ఇళ్లల్లో సోదాలు నిర్వహించడంతో ఆ సంఘటన పెద్ద ఎత్తున ఉద్రిక్తతకు దారి తీసింది. ఈ నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నిరసన వ్యక్తం చేయడం, అగ్ర నాయకులు వచ్చి ప్రచారం చేయడం బీజేపీకి ప్లస్‌ అయిందని చర్చించుకుంటున్నారు.

Also Read: బీహార్ లో జరిగిందేమిటి?

మరోవైపు సిద్ధిపేట, గజ్వేల్‌ నియోజకవర్గాలను అభివృద్ధి చేసిన టీఆర్‌ఎస్‌ దుబ్బాకలో మళ్లీ గెలిచినా పట్టించుకోరనే ప్రచారం జనాల్లోకి బాగా వెళ్లింది. దీంతో కేసీఆర్‌ ముందు నుంచి వేసిన వ్యూహం బెడిసికొట్టే అవకాశం ఉందని అనుకుంటున్నారు. ఒకవేళ దుబ్బాకలో టీఆర్‌ఎస్‌కు ప్రతికూల ఫలితాలు వస్తే జీహెచ్‌ఎంసీ ఎన్నికలపై ఉంటుందని విశ్లేషకులు అంటున్నారు.