Homeఅత్యంత ప్రజాదరణజీ బ్లాక్ కింద నిజాం నిధి? అందుకే రహస్యంగా కూల్చారా?

జీ బ్లాక్ కింద నిజాం నిధి? అందుకే రహస్యంగా కూల్చారా?

Treasure Under G Block
తెలంగాణ హైకోర్టు సచివాలయం కూల్చివేతకు అనుమతి ఇవ్వగానే అర్ధరాత్రి కేసీఆర్ సర్కార్ పనులు ఎందుకు మొదలుపెట్టింది.? ఒకేసారి బాంబులతో కుప్పకూల్చకుండా జీ బ్లాక్ ను ప్రొక్లెయినర్లతో ఎందుకు పడగొట్టింది.? అర్ధరాత్రి గుప్త నిధుల కోసం తవ్వినట్టు అందరినీ అటు వైపు రాకుండా నిషేధించి ఎందుకు తవ్వింది. అసలు ఆ జీ బ్లాక్ రహస్యమేంటి? ఇప్పుడు ఇవే అనుమానాలు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి..

*జీ బ్లాక్ చరిత్ర
తెలంగాణ సచివాలయంలోని ‘జీ బ్లాక్’కు సుధీర్ఘ చరిత్ర ఉంది. అది 132 ఏళ్ల కిందట 1888లో ఆరో నిజాం నవాబు మహబూబ్ అలీఖాన్ దీన్ని నిర్మించారు. నాడు సైఫాబాద్ ప్యాలెస్ గా దీన్ని పిలిచేవారు. నాడు నిజాం రాజ్యం ఆర్థిక వ్యవహారాలు, ట్రెజరీ కార్యకలాపాలు ఈ జీ బ్లాక్లోనే జరిగేవి. నిజాం రిజర్వ్ బ్యాంక్ గా జీ బ్లాక్ ఉండేది. 2012,2016లో సచివాలయం సమీపంలోని హోంసైన్స్ కాలేజీ, విద్యారణ్య పాఠశాలల ఆవరణల్లో నిర్మాణాల కోసం తవ్వకాలు జరిగినప్పుడు సొరంగాలు బయటపడ్డాయి. దీంతో రంగ ప్రవేశం చేసిన పురావస్తు శాఖ మింట్ కాంపౌండ్ నుంచి మరో సొరంగం ఉన్నట్టు గుర్తించింది. ఈ మూడు సొరంగాలు జీ బ్లాక్ కింద వరకు ఉండడాన్ని గుర్తించారు.

బీజేపీపై కేసీఆర్ కాంగ్రెస్ అస్త్రం.. ఫలిస్తుందా?

ఈ జీ బ్లాక్ ను నాడు నిజాం రిజర్వ్ బ్యాంక్ గా ఉపయోగించాడు. భూగర్భంలో స్ట్రాంగ్ రూములు నిర్మించినట్టు పురావస్తు శాఖ అధికారులు గుర్తించారు. జి బ్లాక్ కింద నిధి ఖచ్చితంగా ఉంటుందని పురావస్తు శాఖ అంటోంది. నిజాం సంపద విలువ వేల కోట్ల మేరకు ఉంటుందని అంచనా..సొరంగాలపై పరిశోధనకు పురావస్తుశాఖ అనుమతి కోరినా కేసీఆర్ సర్కార్ అప్పట్లో ఇవ్వలేదు. తాజాగా సచివాలయం కూల్చివేతను రహస్యంగా చేపట్టడంపై అందరిలోనూ అనుమానాలు కలుగుతున్నాయి. తాజాగా కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి కూడా జీ బ్లాక్ కింద నిజాం సంపద కొల్లగొట్టడానికే రహస్యంగా కూలుస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు.

కేటీఆర్ వ్యాఖ్యలకు కౌంటర్ బాగానే పడిందిగా?

*నిజాం సంపద కొల్లగొట్టడానికా?
పైగా ఈ జీ బ్లాక్ కూల్చివేసే సమయాల్లో కేసీఆర్ హైదరాబాద్ లో లేకపోవడం అనుమానాలకు తావిస్తోంది. పైగా సీఎస్, డీజీపీలు స్వయంగా అక్కడ ఉండి మరీ పనులు అర్ధరాత్రి పర్యవేక్షించారు. ఎవరినీ లోపలికి రానీయకుండా ఆ రోడ్డునే మూసేశారు. మీడియాను అనుమతించలేదు. దీంతో ‘ఈ జీ బ్లాక్’ రహస్యం ఇప్పుడు గండికోట రహస్యంగా మారింది. నిజంగానే నిజాం నిధులు కొల్లగొట్టే స్కెచ్చా అన్న అనుమానాలు కలుగుతున్నాయి.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.
Exit mobile version