మోడీ సార్.. ప్లీజ్ అంటున్న ఎంపీ రఘురామ

ఎవ్వరికి రాని డౌట్లు మన నర్సాపురం వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణం రాజు కు వస్తుంటాయి. అందుకే ఆయన అందరిలోకి ప్రత్యేకంగా కనిపిస్తుంటారు. ఏది చేసినా తనదైన ముద్ర వేయడానికి ప్రయత్నిస్తుంటారు. ఇప్పటికే కరోనా కారణంగా ఎంతమంది చనిపోయారో అందరూ చూశాం. తిరుపతి ఎంపీ దుర్గాప్రసాద్ కూడా కరోనా బారిన పడి చనిపోయాడు. కొందరు బీజేపీ ఎంపీలు చనిపోయారు. కేంద్రహోంమంత్రి అమిత్ షాకు కూడా కరోనా సోకింది. అందుకే ఇప్పుడు కరోనా వ్యాక్సిన్ ను తొలి విడతలో […]

Written By: NARESH, Updated On : January 10, 2021 8:22 pm
Follow us on

ఎవ్వరికి రాని డౌట్లు మన నర్సాపురం వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణం రాజు కు వస్తుంటాయి. అందుకే ఆయన అందరిలోకి ప్రత్యేకంగా కనిపిస్తుంటారు. ఏది చేసినా తనదైన ముద్ర వేయడానికి ప్రయత్నిస్తుంటారు.

ఇప్పటికే కరోనా కారణంగా ఎంతమంది చనిపోయారో అందరూ చూశాం. తిరుపతి ఎంపీ దుర్గాప్రసాద్ కూడా కరోనా బారిన పడి చనిపోయాడు. కొందరు బీజేపీ ఎంపీలు చనిపోయారు. కేంద్రహోంమంత్రి అమిత్ షాకు కూడా కరోనా సోకింది.

అందుకే ఇప్పుడు కరోనా వ్యాక్సిన్ ను తొలి విడతలో ప్రజాప్రతినిధులకు కూడా ఇవ్వాలని తొలి డిమాండ్ చేశాడు మన ఎంపీ రఘురామకృష్ణం రాజు. హెల్త్ వర్కర్లకు, కరోనా వారియర్స్ కు, వృద్ధులతోపాటు అందులో ప్రజాప్రతినిధులను చేర్చాలని తాజాగా ప్రధాని నరేంద్రమోడీకి లేఖ రాశారు.

ఆరోగ్యసిబ్బంది, కరోనా వారియర్స్ తోపాటు ప్రజాప్రతినిధులు కూడా ఇప్పుడు ప్రజల్లోకి వెళుతూ యాక్టివ్ రోల్ పోషిస్తున్నారు. ఈ క్రమంలోనే కరోనా బారినపడుతున్నారు. అందుకే వారికి కూడా ఇవ్వాలని రఘురామ కోరారు.

మరి ప్రధాని మోడీకి వచ్చిన ఈ అనూహ్యప్రతిపాదనపై స్పందిస్తారా? రఘురామ కోరికను మన్నిస్తారా? లైట్ తీసుకుంటారా? అన్నది వేచిచూడాలి.