Mahesh Rajamouli: మహేష్ తో సినిమా.. రాజమౌళికి అదే ప్రాబ్లమట?

Mahesh Rajamouli: దర్శకధీరుడు రాజమౌళితో సినిమా అంటే చాలు అగ్రహీరోలంతా క్యూలో నిలబడుతారు. కానీ రాజమౌళి మాత్రం సెలక్టివ్ గా సినిమాలు చేస్తున్నాడు. పూర్తిగా కథ రెడీ అయ్యాక అందుకు సూట్ అయ్యే హీరోలనే ఎంపిక చేసుకుంటున్నాడు. ఈ క్రమంలోనే టాలీవుడ్ అగ్రహీరోలైన చిరంజీవి, నాగార్జున, బాలక్రిష్ణ, వెంకటేశ్ లతో రాజమౌళి ఇంతవరకూ సినిమాలు చేయలేకపోయాడు. నవతరం యంగ్ హీరోలనే రాజమౌళి ఎంపిక చేసుకుంటారు. తాజాగా ‘ఆర్ఆర్ఆర్’ పూర్తి కావస్తోంది. షూటింగ్ కంప్లీట్ అయ్యి కేవలం పోస్ట్ […]

Written By: NARESH, Updated On : September 21, 2021 9:58 am
Follow us on

Mahesh Rajamouli: దర్శకధీరుడు రాజమౌళితో సినిమా అంటే చాలు అగ్రహీరోలంతా క్యూలో నిలబడుతారు. కానీ రాజమౌళి మాత్రం సెలక్టివ్ గా సినిమాలు చేస్తున్నాడు. పూర్తిగా కథ రెడీ అయ్యాక అందుకు సూట్ అయ్యే హీరోలనే ఎంపిక చేసుకుంటున్నాడు. ఈ క్రమంలోనే టాలీవుడ్ అగ్రహీరోలైన చిరంజీవి, నాగార్జున, బాలక్రిష్ణ, వెంకటేశ్ లతో రాజమౌళి ఇంతవరకూ సినిమాలు చేయలేకపోయాడు. నవతరం యంగ్ హీరోలనే రాజమౌళి ఎంపిక చేసుకుంటారు.

తాజాగా ‘ఆర్ఆర్ఆర్’ పూర్తి కావస్తోంది. షూటింగ్ కంప్లీట్ అయ్యి కేవలం పోస్ట్ ప్రొడక్షన్ మాత్రమే మిగిలి ఉంది. థియేటర్లకు ప్రేక్షకులు వచ్చే పరిస్థితి లేకపోవడంతో దసరాకు విడుదల చేస్తానన్న ఆర్ఆర్ఆర్ మరింత ఆలస్యం అయ్యేలా కనిపిస్తోంది.

ఈ క్రమంలోనే తన తర్వాత మూవీపై పడ్డాడట రాజమౌళి. ఇప్పటికే ప్రకటించినట్టు మహేష్ బాబు హీరోగా కేఎల్ నారాయణ నిర్మాణంలో సినిమా తీయనున్నాడు.. అయితే రాజమౌళి అనుకున్నట్టుగా ఇప్పటికీ ఆయన తండ్రి విజయేంద్రప్రసాద్ కథను తీర్చిదిద్దలేదని సమాచారం.

మొదట జేమ్స్ బాండ్ తరహా కథను మహేష్ కోసం రెడీ చేయాలని రాజమౌళి భావించాడట.. ఆ తర్వాత ఆఫ్రికన్ అడవుల నేపథ్యంలో యాక్షన్ అడ్వంచర్ ప్లాన్ చేశాడట.. దానికోసం ఓ నవల హక్కులు కూడా కొన్నారని సమాచారం. ఇప్పుడు ఆ కథ కూడా ఓ కొలిక్కి రాకపోవడంతో రాజమౌళి పునరాలోచనలో పడిపోయినట్టు సమాచారం.

తాజాగా మహేష్ బాబుకు దర్శకుడు రాజమౌళి మూడు లైన్లు చెప్పాడని.. అవేవీ సంతృప్తికరంగా లేవని ఇద్దరూ డిసైడ్ అయినట్టు సమాచారం. ప్రస్తుతం విజయేంద్రప్రసాద్ మహేష్ కథపైనే పనిచేస్తున్నట్టు తెలుస్తోంది. ఇది మరింత ఆలస్యం అయ్యేలా ఉంది. దీంతో ఈ గ్యాప్ లో బాలీవుడ్ లో ఒక సినిమా చేసే ఆలోచనలో రాజమౌళి ఉన్నట్టు సమాచారం. మహేష్ కూడా ప్రస్తుతం ‘సర్కారివారి పాట’, త్రివిక్రమ్ మూవీలు తీయనున్నాడు. ఆ రెండింటి తర్వాత రాజమౌళి సినిమా ఉండనుంది.