Homeఅత్యంత ప్రజాదరణకొదమసింహం.. కౌబాయ్ కోసం ఇంత ఖర్చు చేశారా?

కొదమసింహం.. కౌబాయ్ కోసం ఇంత ఖర్చు చేశారా?

తెలుగు సినీ చరిత్రలో మెగాస్టార్ చిరంజీవిది ప్రత్యేక స్థానం. నటనతో పాటు డ్యాన్స్, డైలాగ్స్.. ఇలా అన్నింటిని తనదైన శైలిలో ప్రదర్శించే నటుడిగా పేరు తెచ్చుకున్నాడు. మొదట్లో విలన్ గా వెండితెరపై ఎంట్రీ ఇచ్చినా ఆ తరువాత సుప్రీం హీరోగా.. సూపర్ స్టార్ గా.. ఆ తరువాత మెగాస్టార్ గా ఫ్యాన్స్ నుంచి బిరుదు తెచ్చుకున్నారు. కేవలం ఆయన పేరు చెప్పుకొని సినిమాల్లోకి వచ్చిన వారెందరో ఇప్పుడు ప్రముఖ హీరోలుగా కొనసాగుతున్నారు. అయితే యువకుడిగా.. రైతుగా.. లాయర్ గా.. ఇలా అన్ని రకాల పాత్రలను చేసిన చిరంజీవి కౌభాయ్ పాత్రలో తన నటనతో ఇరగదీశాడు. అప్పట్లో కౌభాయ్ పాత్రలకు క్రేజీ ఉండేది. ఇందులో చిరంజీవి కౌభాయ్ అంటే ఇంకా అట్రాక్షనే.

చిరంజీవి ఎన్నో విభిన పాత్రలను పోషించేవాడు. అన్నింటిలో తనదైన ముద్ర వేశాడు. దీంతో కౌభాయ్ గా కూడా చిరంజీవి నటిస్తే బాగుండునన్న ఫ్యాన్స్ అనుకునేవారు. ఈ విషయాన్ని గ్రహించిన నిర్మాత కైకాల నాగేశ్వర్ రావు చిరంజీవితో కౌభాయ్ సినిమా తీయాలని నిర్ణయించుకున్నాడు. ఈ విషయాన్ని చిరంజీవితో చెబితే అందుకు ఆయన కూడా ఒప్పుకున్నాడు. అయితే మిగతా సినిమాల కంటే కౌభాయ్ సినిమాకు ఖర్చు ఎక్కువవుతుందని చిరంజీవి చెప్పాడు. అయినా నాగేశ్వర్ రావు వెనుకాడలేదు.

నాగేశ్వర్ రావు ఏమాత్రం టైం వేస్ట్ చేయకుండా డైరెక్టర్ కోసం వెతకడం ప్రారంభించారు. ఇదే తరుణంలో ఒకప్పటి తన క్లాస్ మేట్ మురళీమోహన్ రావుకు బాధ్యతలు అప్పగించారు. సంఘర్షణ సినిమా తరువాత చిరంజీవి, మురళీమోహన్ రావు కాంబినేషన్లో వీరి కలయికలో వచ్చిన చిత్రం కొదమ సింహం. ఆ తరువాత కథ కోసం పలు హాలీవుడ్ సినిమాలను చూశారు మురళీమోహన్ రావు. చివరికి అన్నీ కలిసి ఇక్కడి వాతావరణానికి అనుగుణంగా సినిమాను తయారు చేశారు.

నాగేశ్వర్ రావు, విజయేంద్రప్రసాద్, శివశక్తి, పరుచూరి బ్రదర్స్ కలిసి కొదమ సింహం కథను తయారు చేశారు. కౌభాయ్ సినిమాకు సంబంధించిన అంశాలతో పాటు దేశీ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని సినిమా కథను తయారు చేశారు. అయితే నిర్మాత నాగేశ్వర్ రావు ఈ సినిమా మిగతా వాటికంటే భిన్నంగా ఉండాలని ప్రత్యేకంగా కొన్ని సీన్స్ తీయించారు. సినిమాకు అవసరమయ్యే కాస్ట్యూమ్స్ , డ్రెస్సింగ్ ఇతర వాటిలో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఖర్చు చేశారు.

అలాగే మద్రాస్ నుంచి 64 కిలోమీటర్ల దూరంలో ఉన్న చంగల్ పద్దిలో ప్రత్యేకంగా సెట్ వేశారు. ఇక్కడ కేవలం వారం రోజుల షూటింగ్ మాత్రమే తీశారు. అలాగే మద్రాస్, ఊటీ, తలకోన, కడబోగి మహన్, మైసూర్ , బెంగళూర్, కొచ్చి, రాజస్థాన్ ప్రాంతాల్లో ఈ షూటింగ్ జరుపుకుంది. అప్పట్లో ఈ సినిమాకు రూ.4 కోట్ల బడ్జెట్ ను కేటాయించారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ సినిమా తీయాలంటే 100 కోట్లు కావాలి. ఇక ఈ సినిమాలో ముందుగా హీరోయిన్ గా నదియా అనుకున్నారు. అయితే అప్పటికే ఆమెకు వివాహం అయింది. అయినా ఆమెను నాగేశ్వర్ రావు సంప్రదించడంతో ఒప్పుకుంది. అయితే చిరంజీవి డేట్స్ కారణంగా ఆమె స్థానంలో హిందీ నటి సోనమ్ ను పెట్టారు. మొత్తానికి కొదమసింహం సినిమా కోసం ఇంత తతంగం జరిగింది. తాజాగా చిత్ర విశేషాలు పంచుకోవడంతో విషయం వెలుగుచూసింది.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.
Exit mobile version