మరో కరోనా వ్యాక్సిన్ కు కేంద్రం అనుమతి

దేశంలోని ప్రజలకు కేంద్రం మరో గుడ్ న్యూస్ తెలిపింది. ఇప్పటికే ఆక్స్ ఫర్డ్ తయారు చేసి అస్త్రాజెనెకా -సీరం ఇన్ స్టిట్యూట్ వ్యాక్సిన్ కు అత్యవసర వినియోగానికి కేంద్ర ఔషధ నియంత్రణ సంస్థ గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా.. తాజాగా భారత్ బయోటెక్ సంస్థ వ్యాక్సిన్ ‘కోవిషీల్డ్’కుసైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు ఔషధ నియంత్రణ సంస్థ (డీసీజీఐ)కు సిఫార్సు చేసింది. Also Read: గంగూలీకి యాంజియో ప్లాస్టీ.. గుండెలో మరో రెండు బ్లాక్ లు అత్యవసర […]

Written By: NARESH, Updated On : January 3, 2021 10:09 am
Follow us on

దేశంలోని ప్రజలకు కేంద్రం మరో గుడ్ న్యూస్ తెలిపింది. ఇప్పటికే ఆక్స్ ఫర్డ్ తయారు చేసి అస్త్రాజెనెకా -సీరం ఇన్ స్టిట్యూట్ వ్యాక్సిన్ కు అత్యవసర వినియోగానికి కేంద్ర ఔషధ నియంత్రణ సంస్థ గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా.. తాజాగా భారత్ బయోటెక్ సంస్థ వ్యాక్సిన్ ‘కోవిషీల్డ్’కుసైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు ఔషధ నియంత్రణ సంస్థ (డీసీజీఐ)కు సిఫార్సు చేసింది.

Also Read: గంగూలీకి యాంజియో ప్లాస్టీ.. గుండెలో మరో రెండు బ్లాక్ లు

అత్యవసర వినియోగానికి భారత్ బయోటెక్ చేసుకున్న దరఖాస్తును పరిశీలించేందుందుకు శనివారం నిపుణుల కమిటీ సమావేశమైంది. ఇందులో మూడో దశ ప్రయోగాలు జరుగుతున్న ఈ టీకా మెరుగైన ఫలితాలు ఇస్తోందని.. అత్యవసర వినియోగదానికి నిపుణుల బృందం సిఫార్సు చేసింది.

డీసీజీఐ ఆమోదముద్ర వేసి అనుమతుల పత్రాన్ని ఇస్తే దేశవ్యాప్తంగా ఈ వ్యాక్సిన్ ను ప్రజలకు అందిస్తారు. కొన్ని కీలక ప్రక్రియలు పూర్తయితే మార్కెట్ లోకి ఈ టీకాను ప్రవేశపెడుతారు.

Also Read: దేశమంతా కరోనా టీకా ఫ్రీ

ముందుగా కేంద్రం నిర్ణయించిన ప్రకారం కోటి మంది వైద్యసిబ్బందికి, 2 కోట్ల మంది ఫ్రంట్ లైన్ వారియర్స్ కు.. 57 ఏళ్లు పైబడిన 27 కోట్ల మందికి ఈ టీకాను తొలిదశలో ఇస్తారు. ప్రభుత్వ సంస్థల ద్వారానే ఈ టీకాను అందిస్తారు.

మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్