Homeఅత్యంత ప్రజాదరణప్రజలకు కేంద్రం శుభవార్త.. ఈ కార్డ్ తీసుకుంటే రూ.5 లక్షలు..?

ప్రజలకు కేంద్రం శుభవార్త.. ఈ కార్డ్ తీసుకుంటే రూ.5 లక్షలు..?

కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ పేద ప్రజలకు ప్రయోజనం చేకూర్చాలనే ఉద్దేశంతో ఎన్నో స్కీమ్ లను అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. కేంద్రం అమలు చేస్తున్న స్కీమ్ లలో ఆయుష్మాన్ భారత్ స్కీమ్ ఒకటి కాగా ఈ స్కీమ్ ద్వారా ఏకంగా 5 లక్షల రూపాయల వరకు ఉచితంగా ట్రీట్ మెంట్ తీసుకునే అవకాశం ఉంటుంది. ఎవరైతే ఈ స్కీమ్ లో చేరతారో వాళ్లు మాత్రమే ఈ స్కీమ్ ప్రయోజనాలను పొందవచ్చు.

కేంద్రం అమలు చేస్తున్న ఈ స్కీమ్ ద్వారా ఉచితంగా వైద్యం చేయించుకునే అవకాశం ఉంటుంది. పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే ఈ స్కీమ్ ముఖ్య లక్ష్యం కాగా పేద ప్రజలు ఈ స్కీమ్ యొక్క ప్రయోజనాలు పొందడానికి అర్హులు. ఒక్కో కుటుంబం కేంద్రం అమలు చేస్తున్న జన్ ఆరోగ్య యోజన పథకం కింద ఏకంగా 5 లక్షల రూపాయల వరకు బెనిఫిట్ పొందవచ్చు. ఒక్క రూపాయి కూడా చెల్లించకుండా ఈ స్కీమ్ బెనిఫిట్స్ ను పొందవచ్చు.

సమీపంలో ప్రభుత్వ ఆస్పత్రైకి వెళ్లి సీఎంవోను కలిసి ఉచితంగా ఈ స్కీమ్ లో చేరవచ్చు. లేదా ఆరోగ్య మిత్రను సంప్రదించి ఆయుష్మాన్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. పేద ప్రజలకు ఈ స్కీమ్ బెస్ట్ అని చెప్పవచ్చు. దేశంలో రోజురోజుకు కరోనా వైరస్ విజృంభణ అంతకంతకూ పెరుగుతోంది. నిర్లక్ష్యం వహిస్తే ప్రాణాలకే ప్రమాదం ఏర్పడే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇలాంటి సమయంలో ఈ స్కీమ్ లో చేరడం ద్వారా మేలు జరుగుతుంది.

ఎవరైతే ఈ స్కీమ్ లో చేరతారో వాళ్లు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రయోజనాలను పొందడం సాధ్యమవుతుంది. ఆయుష్మాన్ భారత్ స్కీమ్‌లో చేర్కపోతే ఈ ప్రయోజనాలను పొందడం సాధ్యం కాదు.

Kusuma Aggunna
Kusuma Aggunnahttps://oktelugu.com/
Kusuma Aggunna is a Senior Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.
Exit mobile version