బాలీవుడ్ పై ‘బన్ని’ కన్ను.. ప్లాన్ అదుర్స్?

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం బాలీవుడ్ పై కన్ను వేసినట్లు తెలుస్తోంది. ఇటీవల అల వైకుంఠ పురం లో సినిమా తో కొత్త రికార్డులను బ్రేక్ చేశాడు బన్ని. ఇదే ఊపులో కొత్త సినిమాను పాన్ ఇండియా లెవల్ లో మొదలు పెట్టారు. సుకుమార్ డైరెక్షన్ లో తెరకెక్క బోతున్న పుష్ప రెగ్యులర్ షూటింగ్ మొదలు అయింది. Also Read: బాలయ్య ఫిక్స్ అయ్యాడు.. ఇక తప్పదు ! ప్రస్తుతం తెరకెక్కుతున్న పాన్-ఇండియా చిత్రం `పుష్ప` […]

Written By: NARESH, Updated On : November 20, 2020 7:47 pm
Follow us on

allu arjun

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం బాలీవుడ్ పై కన్ను వేసినట్లు తెలుస్తోంది. ఇటీవల అల వైకుంఠ పురం లో సినిమా తో కొత్త రికార్డులను బ్రేక్ చేశాడు బన్ని. ఇదే ఊపులో కొత్త సినిమాను పాన్ ఇండియా లెవల్ లో మొదలు పెట్టారు. సుకుమార్ డైరెక్షన్ లో తెరకెక్క బోతున్న పుష్ప రెగ్యులర్ షూటింగ్ మొదలు అయింది.

Also Read: బాలయ్య ఫిక్స్ అయ్యాడు.. ఇక తప్పదు !

ప్రస్తుతం తెరకెక్కుతున్న పాన్-ఇండియా చిత్రం `పుష్ప` నాలుగు ప్రధాన దక్షిణ భారత భాషలలో విడుదల అవుతుంది. అలాగే బాలీవుడ్ లో కూడా భారీగా విడుదల చేయడానికి చిత్ర యూనిట్ ప్రణాళికలు రచిస్తుందట.

తెలుగు రాష్ట్రాలు సహా కేరళలో బన్నీకి భారీ ఫాలోయింగ్ ఉంది. తమిళనాడు .. కర్ణాటకలోనూ మంచి అభిమానులు ఉన్నారు. ఇప్పుడు స్టైలిష్ స్టార్ కళ్ళు బాలీవుడ్ పై పడ్డాయి. అతను తన మొదటి ప్రయత్నంతోనే హిందీ చిత్ర పరిశ్రమలో తనదైన ముద్ర వేయడానికి పెద్ద ఎత్తున ప్రణాళికలు వేస్తున్నాడని గుసగుసలు వినిపిస్తున్నాయి.అల్లు అర్జున్ ఈ చిత్రం విడుదలకు ముందే ఉత్తరాదిన ప్రచారం చేయడానికి వెళ్తున్నట్లు తెలుస్తోంది. పుష్పకు బాలీవుడ్ లో విస్త్రత ప్రచారం తెచ్చేలా ప్రత్యేకించి ఒక పీఆర్ టీమ్ ని సిద్ధం చేయాలని భావిస్తున్నారట.

Also Read: అక్కడ కూడా మహేశ్ బాబు ‘మైండ్‌ బ్లాక్‌’ చేస్తాడా.?

ముఖ్యంగా ఇండస్ట్రీ అరడజను అగ్ర హీరోలు ఇరుగు పొరుగు భాషలతో పాటు నార్త్ బెల్ట్ లోనూ ఫాలోయింగ్ సంపాదించాలని మార్కెట్ పెంచుకోవాలని తహతహలాడుతున్నారు.

ఉత్తరాదిన ప్రభాస్ కి ఇప్పటికే ఓ రేంజు ఉంది. ఇప్పుడు ఆర్.ఆర్.ఆర్ తో రామ్ చరణ్ – రామారావు పేర్లు ఆ బెల్టులో మార్మోగుతున్నాయి. మహేష్ .. అల్లు అర్జున్ కూడా పోటీ బరిలో ఉన్నారు.ఇతరుల కంటే జెట్ స్పీడ్ తో దూసుకెళ్లేలా అల్లు ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలుస్తోంది.

మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్