Homeలైఫ్ స్టైల్Apples: ఎర్రగా ఉన్నాయని ఆపిల్స్ తింటున్నారా? మీ ప్రాణాలు ఖతమే?

Apples: ఎర్రగా ఉన్నాయని ఆపిల్స్ తింటున్నారా? మీ ప్రాణాలు ఖతమే?

Apples: రోజు ఒక ఆపిల్ తింటే చాలు వైద్యుడి దగ్గరకు వెళ్లాల్సిన అసవరం ఉండదని చెబుతుంటారు. ఆపిల్ కు ఉన్న విలువ అలాంటిది. పండ్లు తింటే ఎంతో ప్రయోజనమని తెలియడంతో వాటిని తినేందుకు ఎక్కువ ఇష్టపడుతున్నారు. కానీ ఇటీవల కాలంలో పండ్లపై వాడే రసాయనాలతో పండ్లు రంగులుగా కనిపిస్తున్నా అవి తినడం వల్ల అనర్థాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో వినియోగదారులను ఆకట్టుకోవడానికి వ్యాపారులు రసాయనాలతో రంులు వేస్తున్నారు. దీంతో ఆరోగ్యం దెబ్బ తింటుంది. ఆపిల్స్ విషయంలో రంగుల ప్రభావం ఎక్కువ కావడంతో పలు రోగాల బారిన పడుతున్నారు.

Apples
Apples

ఆపిల్స్ హిమాచల్ ప్రదేశ్, బెంగుళూరు నుంచి ఎక్కువగా ఆపిల్స్ రవాణా అవుతుంటాయి. దీంతో ఇవి ఎక్కువ కాలం నిల్వ ఉండేందుకు రంగులు కలిపిన రసానాలను పైన చల్లి వాటిని భద్రపరుస్తున్నారు బూట్లకు వాడే పాలిష్ తరహా రసాయనాలు పండ్లపై చల్లుతున్నారు. దీంతో ఇవి నిగారింపుగా కనిపిస్తున్నాయి. వ్యాపారులే రంగులు పూసి ఆకర్షణీయంగా ప్యాకింగ్ చేసి విక్రయిస్తున్నారు. దీంతో వాటిని ప్రజలకు అంటగట్టేందుకు సిద్ధపడుతున్నారు. వీటితో ఆరోగ్యం పాడైపోయే ప్రమాదం పొంచి ఉంటోంది.

రసాయనాలు పూసిన ఆపిల్స్ తిన్న ప్రజల ఆరోగ్యం పాడైపోతోంది. పట్టణాల్లో వీటిని విక్రయిస్తూ వ్యాపారులు సొమ్ము చేసుకుంటున్నారు. వీటిని పిల్లలకు తినిపించడం వల్ల వారిలో తీవ్ర అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. ముఖ్యంగా కేన్సర్ బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. పలు ప్రాంతాల్లో ఇలా ఇష్టారీతిగా పండ్లు విక్రయిస్తున్నా ఎవరు పట్టించుకోవడం లేదు. వ్యాపారుల మీద కనీస చర్యలు తీసుకోవడం లేదు. దీంతో మూడు పువ్వులు ఆరు కాయలుగా వ్యాపారాలు విస్తరిస్తున్నా అధికార యంత్రాంగం మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి.

Apples
Apples

రసాయనాలు చల్లే పండ్లతో రోగాలు వ్యాపించే ప్రమాదమున్నా అధికారులు నిర్లక్ష్యంగా ఉంటున్నారనే వాదనలు వస్తున్నాయి. రసాయనాలు వాడిన వాటిని తినడం వల్ల రోగాలు సోకే ప్రమాదం ఉంది. వీటిని తినే ముందు నీటిలో ఉప్పువేసి కడిగిన తరువాత తినాలి. లేదంటే రసాయనాలు మన శరీరంలోకి ప్రవేశించి వ్యాధుల బారిన పడే అవకాశాలున్నాయి. దీంతో ఆపిల్ లను తినే ముందు జాగ్రత్తగా ఉండాలి. లేదంటే మనకు నష్టాలే రానున్నాయి. ఆపిల్ లు తినటానికి ముందే వాటిని శుభ్రం చేసుకుని తినడానికి చొరవ తీసుకుంటే మంచిది.

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.

Most Popular

Samsung Galaxy S25: ఈ ఫోన్ పై రూ.18,000 తగ్గింపు.. బ్యాంక్ ఆఫర్స్ కూడా వర్తింపు..

Samsung Galaxy S25: ప్రముఖ మొబైల్ కంపెనీ దిగ్గజం Samsung నుంచి కొత్త ఫోన్లు అంటే చాలా మంది ఆసక్తి చూపుతూ ఉంటారు. కాస్త ధర ఎక్కువైనా అద్భుతమైన ఫీచర్లు, అనుకూలమైన సాఫ్ట్...

Festivals this year: ఈ ఏడాదిలో ముఖ్యమైన పండుగలు ఏ తేదీల్లో ఉన్నాయంటే..

Festivals this year: తెలుగు పంచాంగం ప్రకారం.. ఆషాడ మాసం లో వచ్చే తొలి ఏకాదశి తో పండుగల సీజన్ ప్రారంభమైనట్లు గా భావిస్తారు. ఆషాడ మాసం పూర్తికాగానే వరుసగా పండుగలు వస్తుంటాయి....

Peddi Sudarshan Reddy: పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత: కడవరకు తెలంగాణ వాదిగానే.. తెలంగాణ వచ్చినంకనే పెండ్లి..

Peddi Sudarshan Reddy: ఆయనకు తెలంగాణ అంటే ఇష్టం. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఉండడం మరింత ఇష్టం.. అందువల్లే ఉద్యమాన్ని భుజాలకు ఎత్తుకున్నారు. పోరాటాల గడ్డ వరంగల్ జిల్లాలో గులాబీ జెండాను నెత్తిన...

YCP Leaders: కుమారులతో వైసిపి నేతలకు తలవంపులు!

YCP Leaders: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వింత పరిస్థితి కనిపిస్తోంది. ఆ పార్టీలో దూకుడు కలిగిన నేతలు చుట్టూ ఇప్పుడు కేసులు అలుముకుంటున్నాయి. అయితే అవి కూటమి ప్రభుత్వం పెట్టిన కేసులు కాదు....

Rain forecast for AP: హమ్మయ్య.. ఏపీకి వర్ష సూచన!

Rain forecast for AP: ఏపీకి చల్లటి కబురు వచ్చింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడింది. వాయువ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. అది అల్పపీడనంగా మారి బలపడుతోంది. ఈరోజు ఉత్తరాంధ్రలో పిడుగులతో...
Oktelugu Epaper
Exit mobile version