Homeలైఫ్ స్టైల్Middle Class Struggles: మనలాంటి మిడిల్ క్లాస్ కు అసలు భారం ఇదే

Middle Class Struggles: మనలాంటి మిడిల్ క్లాస్ కు అసలు భారం ఇదే

Middle Class Struggles:పేదలు.. తమ జీవితాలు ఇంతే అని బతికేస్తారు.. ధన వంతులు తమకు ఏం లోటు అన్నట్లు విచర్చల విడిగా ఖర్చు చేస్తారు. కానీ, ఉన్న బాధల్లా మిడిల్‌ క్లాస్‌కే.. ఇటు పేదలుగా జీవించలేదు.. ఉన్నతంగా బతకలేరు. ఇలాంటి మిడిల్‌ క్లాస్‌ పేరెంట్స్‌ తమ పిల్లలను చదివించి ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు చేస్తున్న ప్రయత్నాలకు స్కూల్‌ ఫీజులు శత్రువుగా మారుతున్నాయి. ఏటా పెరుగుతున్న ఫీజుల భారం మోయలేక తంటాలు పడుతున్నారు. అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. తాజాగా ఓ చార్టెడ్‌ లకౌంటెంట్‌(సీఏ) లింక్డ్‌ఇన్‌లో చేసిన ఓ పోస్టు ఇప్పుడు ఆలోచింపజేస్తోంది. ఇది సమాజంలో విస్తృత చర్చకు దారితీసింది. అడ్మిషన్, ట్యూషన్, యాన్యువల్, ట్రాన్స్‌పోర్ట్, పుస్తకాలు, యూనిఫామ్‌ ఫీజులు వంటి వివిధ రకాల ఖర్చులు సాధారణ స్కూళ్లలో కూడా ఏటా రూ.1–1.5 లక్షల వరకు ఉంటున్నాయి. ఈ భారం మధ్యతరగతి కుటుంబాల ఆదాయంలో 40–80% వరకు ఆక్రమిస్తోంది, దీనిని ‘మిడిల్‌ క్లాస్‌ కిల్లర్‌‘గా సదరు సీఏ తన పోస్టులో పేర్కొంటున్నారు.

Also Read: అప్పులు తీర్చడానికి కొత్త అప్పులు.. గట్టెక్కే అవకాశం ఏంటి ?

స్కూల్‌ ఫీజుల.. ఒక ఆర్థిక సవాలు
స్కూళ్లలో విద్యా ఖర్చులు కేవలం ట్యూషన్‌ ఫీజులకే పరిమితం కాకుండా, అడ్మిషన్, ట్రాన్స్‌పోర్ట్, పుస్తకాలు, యూనిఫామ్, యాన్యువల్‌ ఛార్జీలు, ఇతర అదనపు ఫీజులతో కూడుకున్నవి. ఈ ఖర్చులు సాధారణ ప్రైవేట్‌ స్కూళ్లలో కూడా ఏటా రూ.1–1.5 లక్షల వరకు ఉంటున్నాయి. కొన్ని కుటుంబాలు ఈ ఫీజులను చెల్లించడానికి ఈఎంఐలు కట్టాల్సిన పరిస్థితి ఉంది, ఇది వారి ఆర్థిక స్థిరత్వాన్ని మరింత దెబ్బతీస్తోంది. మధ్యతరగతి కుటుంబాల ఆదాయంలో గణనీయమైన భాగం ఈ ఖర్చులకే వెచ్చించబడుతుంది, ఇది ఇతర అవసరాలైన ఆరోగ్యం, గృహ ఖర్చులు, పొదుపు కోసం తక్కువ ఆస్కారం ఉంటుంది.

ఎందుకు ఇంత ఖర్చు?
విద్యా రంగంలో ప్రైవేటీకరణ పెరగడంతోస్కూళ్లు లాభాపేక్షతో ఫీజులను పెంచుతున్నాయి. ఆధునిక సౌకర్యాలు, బ్రాండ్‌ విలువ, పోటీ వాతావరణం ఈ ఖర్చులను పెంచుతున్నాయి. మధ్యతరగతి కుటుంబాలు తమ పిల్లలకు ‘ఉత్తమ‘ విద్యను అందించాలనే సామాజిక ఒత్తిడి కారణంగా ఖరీదైన ప్రైవేట్‌ స్కూళ్లను ఎంచుకుంటున్నాయి. ఈ ఒత్తిడి ఆర్థిక సమస్యలను మరింత తీవ్రతరం చేస్తుంది. ప్రభుత్వ స్కూళ్లలో సౌకర్యాలు, విద్యా నాణ్యత తక్కువగా ఉండటం వల్ల, చాలా మంది తల్లిదండ్రులు ఖరీదైన ప్రైవేట్‌ స్కూళ్లను ఎంచుకోవడానికి బలవంతంగా నెట్టబడుతున్నారు.

Also Read: పరాయి వ్యక్తులపై ఆకర్షణ.. మొగుళ్లపై వికర్షణ.. ఆడవాళ్లలో ఎందుకీ మార్పు?

మధ్యతరగతిపై తీవ్ర ప్రభావం
ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబం ఆదాయంలో 40–80% స్కూల్‌ ఫీజుల కోసం వెచ్చిస్తోంది, ఇది ఆర్థిక ప్రణాళికను దెబ్బతీస్తోంది. ఈఎంఐలు కట్టడం వల్ల అప్పుల భారం కూడా పెరుగుతోంది. అధిక ఫీజుల వల్ల కుటుంబాలు ఇతర అవసరాలకు ఖర్చు చేయలేకపోతున్నాయి, దీనివల్ల వారి జీవన నాణ్యత తగ్గుతోంది. తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్తు కోసం ఆర్థిక ఒత్తిడిని భరిస్తున్నారు, ఇది మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతోంది.

తప్పనిసరి అవసరంగా..
స్కూల్‌ ఫీజులను ‘లగ్జరీ‘గా చూడడం కంటే, ఇది మధ్యతరగతి కుటుంబాలకు తప్పనిసరి అవసరంగా మారింది. నాణ్యమైన విద్య అందించే స్కూళ్లను ఎంచుకోవడం, సామాజిక హోదా, భవిష్యత్తు అవకాశాలను దృష్టిలో ఉంచుకుని తల్లిదండ్రులు తీసుకునే నిర్ణయం. అయితే, ఈ ఖర్చులు ఆర్థిక సామర్థ్యాన్ని మించి ఉండటం వల్ల, ఇది ఒక సంక్షోభంగా మారుతోంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
RELATED ARTICLES

Most Popular