spot_img
Homeలైఫ్ స్టైల్Everyone Who Bought a Car : లోన్ తీసుకొని కారు కొన్న వారందరూ ఈ...

Everyone Who Bought a Car : లోన్ తీసుకొని కారు కొన్న వారందరూ ఈ విషయం తెలుసుకోవాలి.. లేదంటే డేంజరే

Everyone Who Bought a Car : కారు కొనుగోలు చేయాలని చాలా మందికి కోరిక ఉంటుంది. కానీ ఒకేసారి లక్షల్లో ఆదాయం వెచ్చించాలంటే మనసు రాదు. నెలనెల ఈఎంఐ రూపంలో చెల్లించడం ద్వారా ఎలాంటి ఇబ్బంది ఉండదు అనుకుంటారు. దీంతో కారును లోన్ ద్వారా కొనుగోలు చేస్తారు. Loan ద్వారా కారు కొనుగోలు చేయడం వల్ల మినిమం వడ్డీని విధిస్తారు. ఒక్కోసారి ఆఫర్లు ప్రకటించి ప్రాసెసింగ్ ఫీజు మినహాయింపు వంటివి ఉంటాయి. అయితే Loan ద్వారా కొనుగోలు చేసిన తరువాత తమ కారు సొంతం అయిందని సంబరపడిపోతుంటారు. నెలనెల ఈఎంఐ చెల్లిస్తే చాలు అనుకుంటారు. కానీ ఇలా కారు కొనుగోలు చేస్తే దానికి మీరు ఓనర్ కాదు. ఈ కారుకు ఇంకొకరు ఓనర్ గా వ్యవహరిస్తారు. వారు ఎవరంటే?

కారు కొనుగోలు చేసేవారికి బ్యాంకులు లోన్ ఇస్తుంటాయి. చాల తక్కువ వడ్డీతో కారు కొనుగోలు చేసేందుకు సహకరిస్తారు. అయితే కారు కొనుగోలు చేసే సమయంలో కారు ప్రైస్ మొత్తం బ్యాంకు కారు కంపెనీకి చెల్లిస్తుంది. ఇందుకు గాను వినియోగదారుడి నుంచి కొంత వడ్డీని చెల్లిస్తుంది. ఇది మిగతా రుణాల కంటే తక్కువగానే ఉంటుంది. కారు కొనుగోలు చేసిన తరువాత ఎలాగూ తమ కారే కదా.. అని చాలా మంది రెగ్యులర్ గా ఈఎంఐలు చెల్లించకుండా ఉంటారు. దీంతో ఇవి మిస్సయి అధిక వడ్డీని కట్టాల్సి వస్తుంది. ఈ భారం మరింత పెరిగి అలాగే ఉండిపోతారు. దీంతో ఈ కారును లోన్ ఇచ్చిన బ్యాంకు సీజ్ చేస్తుంది.

ఇలా కారును సీజ్ చేసే అధికారం బ్యాంకుకు ఉంటుంది. ఎందుకంటే ఈ కారుకు బ్యాంకు కూడా ఓనర్ కాబట్టి. అదెలాగంటే? కారు కొనుగోలు చేసిన సమయంలో ఫైనాన్ష్ ద్వారా తీసుకుంటే.. వాహనం రిజిస్ట్రేషన్ సమయంలో కారు కొనుగోలు చేసిన వ్యక్తితో పాటు ఫైనాన్స్ సదుపాయం కల్పించిన బ్యాంకు పేరు కూడా రిజిస్ట్రేషన్ పేపర్స్ పై ఉంటాయి. అంటే కారు కొనుగోలు చేసిన వ్యక్తితో పాటు బ్యాంకు కూడా ఓనర్ అన్నమాటే. అయితే రెగ్యులర్ గా ఈఎంఐలు చెల్లించడం ద్వారా ఎలాంటి ఇబ్బంది ఉండదు. కానీ ఈఎంఐలు చెల్లించకపోవడంతో కారు సీజ్ చేసే అధికారం ఉంటుంది.

మరి ఈఎంఐలు పూర్తి అయిన తరువాత కూడా బ్యాంకు ఓనర్ గా ఉంటుందా? అంటే అస్సలు ఉండదు. అయితే ఇక్కడో పని చేయాలి. కారుకు సంబంధించిన ఈఎంఐ పూర్తయిన తరువాత బ్యాంకుకు వెళ్లి తమ సమాచారం ఇవ్వాలి. అప్పుడు ఫాం 35తో పాటు ‘నో డ్యూ ’ సర్టిఫికెట్ అందిస్తారు. ఈ రెండింటితో పాటు ఆధార్ కార్డు, పాన్ కార్డులను కలిపి రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ఇవ్వాలి. దీంతో ఆర్టీవో అధికారులు ఈ వివరాలను చెక్ చేసుకున్న తరువాత కొత్త రిజిస్ట్రేషన్ పేపర్స్ ను అందిస్తారు.

అయితే ఫైనాన్స్ తీసుకున్న తరువాత ఆర్సీ కార్డుపై కొరు కొనుగోలు చేసిన వ్యక్తితో పాటు ఫైనాన్స్ చేసిన సంస్థ పేరు ఉంటుంది. ఈఎంఐలు పూర్తయిన తరువాత డాక్యుమెంట్లు సమర్పిస్తే ఈ పేరును అధికారులు తొలగిస్తారు. ఇలా వ్యక్తి పేరు మాత్రమే ఉండి.. ఫైనాన్స్ సంస్థ పేరు లేకపోతే అప్పడు పూర్తి స్థాయిలో వ్యక్తి మాత్రమే ఓనర్ అవుతాడు.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Most Popular

Chiranjeevi: చిరంజీవి కెరియర్ లో చేసిన మూడు తప్పులు ఇవే…

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి హీరోగా చేసిన సినిమాలు అతన్ని టాప్ లెవెల్లో నిల్చోబెట్టాయి. ఒక సామాన్య మానవుడు సైతం సినిమా ఇండస్ట్రీకి వచ్చి ఇక్కడ హీరోగా మారవచ్చు అని ప్రూవ్ చేసిన...

Vijay Deverakonda: విజయ్ దేవరకొండ మూవీ రిలీజ్ పోస్ట్ పోన్ వెనక ఇన్ని కారణాలున్నాయి…

Vijay Deverakonda: 'అర్జున్ రెడ్డి' సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ హీరోగా మారిపోయిన నటుడు విజయ్ దేవరకొండ... ప్రస్తుతం ఆయన చేస్తున్న సినిమాల విషయంలో చాలా కేర్ ఫుల్ గా...

Ramayana Trailer Postponed: ‘రామాయన్ ‘ ట్రైలర్ విడుదల వాయిదా.. సంచలనం రేపుతున్న పోస్ట్..

Ramayana Trailer Postponed: బాలీవుడ్ లో నితీష్ తివారీ దర్శకత్వం లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన 'రామాయన్' మూవీ కి సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ ని నేడు గ్రాండ్ గా విడుదల చెయ్యాలని...

Super El Nino: వచ్చే రోజుల్లో సూపర్ ఎల్ నినో.. తెలుగు రాష్ట్రాల్లో ప్రభావం ఎలా ఉంటుందంటే..

Super El Nino: సాంకేతిక పరిజ్ఞానం పెరిగింది. గతంతో పోల్చి చూస్తే వాతావరణం మీద శాస్త్రవేత్తలకు అవగాహన మరింత పెరిగింది. అందువల్లే వర్షాలు.. ఎండలు.. కరువు కాటకాల గురించి అత్యంత స్పష్టంగా...
Oktelugu Epaper
Exit mobile version