Homeలైఫ్ స్టైల్Soul after Death: మరణం తర్వాత ఆత్మ ఇంటికి వస్తుందా?

Soul after Death: మరణం తర్వాత ఆత్మ ఇంటికి వస్తుందా?

Soul after Death: పుట్టే ప్రతి వ్యక్తి గిట్టక మానడు.. అది చాలామంది పెద్దలు, ఆధ్యాత్మిక వాదులు చెబుతూ ఉంటారు. అంటే ఒక వ్యక్తికి పుట్టుక, మరణం సహజం అని అంటుంటారు. అయితే పుట్టిన ప్రతి వ్యక్తి తన జీవితాంతం ఎలాంటి పనులు చేశాడు? ఏ విధంగా సంబంధాలు నెలకొల్పాడు? అన్నవి తన జీవితంలో గుర్తుండిపోతాయి. అయితే ఆ వ్యక్తి చేసిన పాప, పుణ్యాల ప్రకారమే అతడు మరణించిన తర్వాత తన స్థితిగతులు ఉంటాయని గరుడ పురాణం ప్రకారం తెలుస్తోంది. ఈ క్రమంలో ఒక వ్యక్తి మరణించిన తర్వాత తిరిగి ఇంటికి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు. అలా ఇంటికి ఎందుకు వస్తానంటే?

గరుడ పురాణం ప్రకారం.. ఒక వ్యక్తి మరణించిన తర్వాత తన దేహం విడిచి ఆత్మగా మారిపోతుంది. ఈ ఆత్మ కేవలం యమదూతలకు మాత్రమే కనిపిస్తుంది. అయితే మరణించిన వెంటనే వ్యక్తి యమలోకానికి వెళ్లి తిరిగి ఇంటికి వస్తాడు. తనకోసం ఏడ్చే వారికోసం మళ్లీ బతకాలని కోరుకుంటూ ఉంటాడు. ఈ సమయంలో ఆత్మ తిరిగి తన శరీరంలోకి వెళ్లేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తుంది. కానీ యమదూతలు అలా సాధ్యం కాకుండా అడ్డుపడుతూ ఉంటారు. అయితే ఆ వ్యక్తి దహన సంస్కారాలతో పాటు 11 రోజులపాటు నిర్వహించిన కర్మకాండల ప్రకారం అతనికి ఒక రూపం వస్తుంది. 11 రోజుల తర్వాత ఆ వ్యక్తి యమలోకానికి ప్రయాణం ప్రారంభిస్తాడు. ఇలా ఏడాది పాటు ప్రయాణించి చివరికి యమలోకానికి చేరుకుంటాడు.

అయితే ఆ వ్యక్తి కుటుంబ సభ్యులు అతనికి సరైన విధంలో కర్మకాండలు నిర్వహిస్తేనే అతడి ప్రయాణం సులువుగా ఉంటుంది. అలాకాకుండా కుటుంబ సభ్యులు కర్మకాండలో సరైన విధంగా నిర్వహించకపోతే ఆత్మకు ఒక రూపం రాకుండా ఉంటుంది. ఈ క్రమంలో రూపంలేని ఆత్మను యమదూతలు హింసిస్తూ ఉంటారు. బలవంతంగా ఆత్మను తీసుకుపోతూ ఉంటారు. అయితే ఆ ఆత్మబడే క్షోభ కుటుంబ సభ్యులపై పడుతుంది. అతడి కోపం, క్రోధం వలన కుటుంబ సమస్యలు పెరిగిపోతూ ఉంటాయి. అందువల్ల గరుడ పురాణ ప్రకారం మరణించిన వ్యక్తిని దైవంగా భావించి అతడి కర్మకాండలను సక్రమంగా నిర్వహించాలని అంటారు.

అంతేకాకుండా 11 రోజుల వ్యక్తి ఏడాది పాటు యమలోకానికి ప్రయాణం చేస్తాడు. ఈ సమయంలో తన కుటుంబ సభ్యులు తనకోసం ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు చూస్తూ వెళ్తాడు. ఏడాది తర్వాత నిర్వహించే కర్మకాండల పుణ్యంతో అతడు సరైన విధంగా యమలోకానికి చేరుకుంటాడు. ఈ కర్మకాండలు నిర్వహించని పక్షంలో అతడి ఆత్మ బాధపడుతూ ఉంటుంది. ఒకవేళ చివరికి యమలోకానికి చేరినా కూడా.. అతని పాప పుణ్యాల తో శిక్షలు ఉంటాయి. అందువల్ల గరుడ పురాణం ప్రకారం మరణించిన వ్యక్తి విషయంలో ఎటువంటి తప్పులు చేయకుండా జాగ్రత్తగా కర్మకాండలు నిర్వహించాలని పండితులు చెబుతుంటారు.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

Public Movement : ప్రధానుల తల వంచిన ప్రజా ఉద్యమాలు..

Public Movement : ప్రజా ఉద్యమాలు భారత దేశానికి కొత్తకాదు. మన స్వాతంత్య్రమే ప్రజా ఉద్యమాలతో సాధించుకున్నాం. స్వతంత్ర భారతదేశంలో ప్రజా ఉద్యమాలు ప్రభుత్వాలపై గణనీయమైన ప్రభావం చూపాయి. కొన్ని సందర్భాల్లో ప్రధానులు...

Narendra Modi : నాడు రైతులు.. నేడు విద్యార్థులు.. మోదీతో వెనకడుగు వేయించిన ఉద్యమాలు!

Narendra Modi : ప్రధాని నరేంద్రమోదీ.. వరుసగా మూడోసారి ప్రధాని అయ్యారు. ఇటీవలే పండిత్‌ జవహర్‌లాల్‌ నెహ్రూ పేరిట ఉన్న రికార్డును కూడా అధిగమించారు. అత్యధిక కాలం పాలించిన ప్రధానిగా చరిత్ర సృష్టించారు....

Cockroach Janata Party రాజకీయ పార్టీగా సిజెపి.. తర్వాతి అడుగు అదే..

Cockroach Janata Party ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. కొత్త విద్యా శాఖ మంత్రిగా ప్రహ్లాద్ జోషి నియమితులయ్యారు. ఇక్కడితోనే సీజేపీ ఆగిపోతుందా.. తదుపరి ఏం చేస్తుంది.. అసలు బొద్దింకల తదుపరి లక్ష్యం...

Chiranjeevi : బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన గబ్బర్ సింగ్ నటుడికి మెగాస్టార్ చిరంజీవి భారీ విరాళం..

Chiranjeevi : ఆపదలో ఉన్నవారికి సహాయం చేయడం మెగాస్టార్ చిరంజీవి కి కొత్తేమి కాదు. ప్రతీ నెల ఎవరికో ఒకరికి ఆయన నుండి సహాయం అందుతూనే ఉంటుంది. చిరంజీవి చేసినన్ని సహాయ కార్యక్రమాలు...

Student Movements in India బొద్దింకలే మొదలు కాదు.. మన దేశంలో ఎన్ని విద్యార్థి ఉద్యమాలు జరిగాయి అంటే..

Student Movements in India ఏ దేశానికైనా సరే అక్కడి యువత ప్రధాన బలం. యువత సానుకూలంగా ఉంటేనే ఆదేశం అభివృద్ధి పథంలో సాగుతూ ఉంటుంది. యువతలో అసంతృప్తి పెరిగిపోతే ఆది కాస్త...
Oktelugu Epaper
Exit mobile version