హైదరాబాద్ సైదాబాద్ కాలనీలో ఆరేళ్ల పాపపై అత్యాచారానికి పాల్పడి, హత్య చేసిన నిందితుడిని ఎన్ కౌంటర్ చేస్తామని మంత్రి మల్లారెడ్డి స్పష్టం చేశారు. నిందితుడిని త్వరలోనే పట్టుకుంటామని, ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలే ప్రసస్తే లేదన్నారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించి, నష్టపరిహారం ఇస్తామని భరోసా ఇచ్చారు. అటు నిందితుడు రాజును పట్టుకునేందుకు పోలీసులు 6 టాస్క్ ఫోర్స్ బృందాలతో గాలిస్తున్నారు.