ఎంపీ విజయసాయి రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ పై హైదరాబాద్ సీబీఐ కోర్టులో మంగళవారం విచారణ జరిగింది. విజయసాయి బెయిల్ రద్దు చేయాలంటూ నరసాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరిపింది. ఈ సందర్భంగా కౌంటర్ దాఖలు చేయాలని కోర్టు విజయసాయి రెడ్డి ని ఆదేశించింది. కౌంటర్ దాఖలుకు సీబీఐ సైతం గడువు కోరడంతో విచారణను ఈ నెల 13వ తేదీకి వాయిదా వేసింది.