కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు ను ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు పరామర్శించారు. కిడ్నీ సమస్యతో బాధపడుతూ హైదరాబాద్ లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వీహెచ్ కు ఆయన ఫోన్ చేసి ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. వైద్యుల సలహాలను పాటించి కోలుకోవాలని సూచించారు. పూర్తి ఆరోగ్యంతో తిరిగి ప్రజా సేవలో నిమగ్నం కావాలని ఆకాంక్షించారు. తనను గుర్తి పెట్టుకుని పరామర్శించిన వెంకయ్యకు వీహెచ్ ధన్యవాదాలు తెలిపారు.