జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా క్రికెట్ లెజెండ్ సచిన్ యూవతకు సందేశం ఇచ్చాడు. ఆటను ఓ అలవాటుగా మార్చుకోవాలని, అత్యంత కఠిన పరిస్థితుల్లోనూ స్పోర్ట్స్ నమ్మకాన్ని, సంతోషాన్ని ఇస్తాయని మాస్టర్ ట్వీట్ చేశాడు. ప్రతి ఏడాది ఆగస్ట్ 29న హాకీ లెజెండ్ మేజర్ ధ్యాన్ చంద్ జయంతిని పురస్కరించుకొని నేషనల్ స్పోర్ట్స్ డే జరుపుకుంటున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా తన ట్వీట్ తో పాటు పిల్లలతో కలిసి తాను క్రికెట్ ఆడుతున్న వీడియోను కూడా సచిన్ షేర్ చేశాడు.
Sport brings hope and joy even in the most challenging circumstances. This #NationalSportsDay, make playing a habit. Keep ourselves and those around us happy. pic.twitter.com/LUMF2N4wUx
— Sachin Tendulkar (@sachin_rt) August 29, 2021