రాష్ట్రంలో 19 మంది డీఎస్పీలను ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు డీజీపీ మహేందర్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ లో పోస్టింగ్ కోసం వెయింగ్ లో ఉన్న జీ హనుమంత రావును కూకట్ పల్లి ట్రాఫిక్ ఏసీపీగా బదిలీ చేశారు. ఇప్పటి వరకు అక్కడ ట్రాఫిక్ ఏసీపీగా ఉన్న ఏ చంద్రశేఖర్ ను కూకట్ పల్లి ఏసీపీగా నియమించారు. కూకట్ పల్లి ఏసీపీగా ఉన్న బీ సురేందర్ రావును సైబరాబాద్ ఏసీపీ, ఎస్బీగా బదిలీ చేశారు. ఇబ్రహింపట్నం ఏసీపీగా ఉన్న వై యాదగిరి రెడ్డిని రాచకొండ సీపీ ఆఫీస్ లో , జగిత్యాల ఎస్టీపీఓ గా ఉన్న పీ వెంకటరమణ, చౌటుప్పల్ ఏసీపీగా ఉన్న పీ సత్తయ్, గద్వాల డీఎస్పీ ఏ యాదగిరిని చీఫ్ ఆఫీస్ లో రిపోర్ట్ చేయాలని ఆదేశించారు.