Tollywood Drugs Case: ఈడీ విచారణకు తరుణ్

హీరో తరుణ్ ఈడీ విచారణకు హాజరయ్యారు. మనీ లాండరింగ్ కోణంలో ఆయన బ్యాంకు ఖాతాలను అధికారులు పరిశీలిస్తున్నారు. అనుమానాస్పద లావాదేవీలు, డ్రగ్స్ విక్రేత కెల్విన్ తో ఉన్న సంబంధాల గురించి ఈడీ అధికారులు ఆరా తీస్తున్నారు. ఎఫ్ క్షబ్ లో జరిగే పార్టీలకు ఎప్పుడైనా హాజరయ్యారా మాదకద్రవ్యాలు వినియోగించే సెలబ్రిటీలెవరైనా మీకు తెలుసా? అనే అంశాలపై క్షణ్ణంగా విచారించే అవకాశం ఉన్నట్లు సమాచారం. మరోవైపు తరుణ్ నుంచి సేకరించిన నమూనాల్లో డ్రగ్స్ ఆనవాళ్లు లేవని ఇటీవల ఎఫ్ […]

Written By: Suresh, Updated On : September 22, 2021 10:41 am
Follow us on

హీరో తరుణ్ ఈడీ విచారణకు హాజరయ్యారు. మనీ లాండరింగ్ కోణంలో ఆయన బ్యాంకు ఖాతాలను అధికారులు పరిశీలిస్తున్నారు. అనుమానాస్పద లావాదేవీలు, డ్రగ్స్ విక్రేత కెల్విన్ తో ఉన్న సంబంధాల గురించి ఈడీ అధికారులు ఆరా తీస్తున్నారు. ఎఫ్ క్షబ్ లో జరిగే పార్టీలకు ఎప్పుడైనా హాజరయ్యారా మాదకద్రవ్యాలు వినియోగించే సెలబ్రిటీలెవరైనా మీకు తెలుసా? అనే అంశాలపై క్షణ్ణంగా విచారించే అవకాశం ఉన్నట్లు సమాచారం.

మరోవైపు తరుణ్ నుంచి సేకరించిన నమూనాల్లో డ్రగ్స్ ఆనవాళ్లు లేవని ఇటీవల ఎఫ్ ఎస్ ఎల్ నివేదికలో తేలింది. డ్రగ్స్ కేసులో ఆరోపణలతో 2017 జూలైలో తరుణ్ నుంచి ఎక్సైజ్ శాఖ నమూనాలు సేకరించింది. తరుణ్ రక్తం, వెంట్రుకలు, గోళ్లను పరీక్షించిన రాష్ట్ర ఫోరెన్సిక్ లేబొరేటరీ ఈ మేరకు నివేదిక విడుదల చేసింది. దీంతో ఎక్సైజ్ శాఖ తరుణ్ కు క్లీన్ చిట్ ఇచ్చింది.

కాగా మత్తుమందుల కేసులో ఈడీ చేపట్టిన దర్యాప్తు తుదిదశకు చేరుకున్నట్లుగా తెలుస్తోంది. మనీ లాండరింగ్ కోణంలో 12 మంది సినీ ప్రముఖులకు నోటీసులిచ్చిన ఈడీ గత కొన్ని రోజుల నుంచి వారిని విచారిస్తోంది. ఇప్పటి వరకూ పూరీజగన్నాథ్, రానా, చార్మి, మొత్తం 11 మంది సెలబ్రిటీలను విచారించింది.