
నిధుల మళ్లింపు వ్యవహారంలో ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావుకు చెందిన మధుకాన్ సంస్థల కార్యాలయాలు, ఇళ్లలో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు రెండో రోజు కూడా సోదాలు నిర్వహించారు. నిన్న ఉదయం నుంచి రాత్రి వరకు హైదరాబాద్ లోని మధుకాన్ ఇన్ప్రా కార్యాలయంతోపాటు జుబ్లీహిల్స్, ఖమ్మంలో నామా నాగేశ్వరరావు, డైరెక్టర్ల ఇళ్లు, కార్యాలయాల్లో ఈడీ తనిఖీలు చేపట్టింది. ఇవాళ పలు కార్యాలయాలు తనిఖీ చేయడంతో పాటు బ్యాంకు ఖాతాలు, లాకర్లను ఈడీ బృందాలు పరిశీలించాయి.