
ప్రజలు చూపిస్తున్న ప్రేమే తనకు గొప్ప అవార్డులని ప్రముఖ నటుడు సోనూసూద్ అన్నారు. ఈ ఏడాది పద్మవిభూషణ్ అవార్డుకు సోనూసూద్ కు ఇవ్వాలని కోరుతూ టాలీవుడ్ నటుడు బ్రహ్మాజీ ఓ ట్వీట్ పెట్టారు. గత కొంతకాలంగా సోనూ చేస్తున్న నిర్విరామ సేవలను గుర్తించి ఈ అవార్డుతో గౌరవించాలని అభిప్రాయపడ్డారు. బ్రహ్మాజీ పెట్టిన ట్వీట్ పై సోనూ స్పందిస్తూ బ్రదర్ 135 కోట్ల మంది భారతీయుల ప్రమను పొందడమే గొప్ప అవార్డు. ఇప్పటికే నేనే ఆ అవార్డును పొందాను అని రిప్లై ఇచ్చారు.