పాక్ లో ఘోర రైలు ప్రమాదం..30మంది మృతి

పాకిస్థాన్ లో సోమవారం ఉదయం ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళ్తోన్న రెండు రైళ్లు ఢీకొనడంతో దాదాపు 30 మంది ప్రాణాలు కోల్పోయారు. గాయపడిన వారి సంఖ్య భారీగా ఉంటుందని స్థానిక మీడియా వెల్లడించింది. దక్షిణ పాక్ కు చెందిన ఘోత్కిలోని రెతి- దహర్కి రైల్వే స్టేషన్ల మధ్య ఈ ప్రమాదం జరిగింది. లాహోర్ వైపు వెళ్తోన్న సర్ సయ్యద్ ఎక్స్ ప్రెస్ కరాచీ నుంచి సర్గోధా వెళ్తున్న మిల్లత్ ఎక్స్ ప్రెస్ ప్రమాదానికి గురయ్యాయి. […]

Written By: Suresh, Updated On : June 7, 2021 12:00 pm
Follow us on

పాకిస్థాన్ లో సోమవారం ఉదయం ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళ్తోన్న రెండు రైళ్లు ఢీకొనడంతో దాదాపు 30 మంది ప్రాణాలు కోల్పోయారు. గాయపడిన వారి సంఖ్య భారీగా ఉంటుందని స్థానిక మీడియా వెల్లడించింది. దక్షిణ పాక్ కు చెందిన ఘోత్కిలోని రెతి- దహర్కి రైల్వే స్టేషన్ల మధ్య ఈ ప్రమాదం జరిగింది. లాహోర్ వైపు వెళ్తోన్న సర్ సయ్యద్ ఎక్స్ ప్రెస్ కరాచీ నుంచి సర్గోధా వెళ్తున్న మిల్లత్ ఎక్స్ ప్రెస్ ప్రమాదానికి గురయ్యాయి. మిల్లత్ ఎక్స్ ప్రెస్ రైలు పట్టాలు తప్పడమే ఈ ప్రమాదానికి కారణమని అధికారులు వెల్లడించారు.