Tokyo Paralympics: టేబుల్ టెన్నిస్.. ఓటమితో మొదలు

పారాలింపిక్స్ లో భారత టేబుల్ టెన్నిస్ క్రీడాకారులు ఓటమితో తమ ప్రస్థానం ఆరంభించారు. ప్యాడ్లర్లు భావినాబెన్ పటేల్, సోనాల్ బెన్ మనుభాయి పటేల్ తొలి రౌండ్లలో ఓటమి పాలయ్యారు. మహిళల క్లాస్-3 విభాగంలో పోటీపడ్డ సోనాల్ బెన్ మొదటి మూడు గేముల్లో ఆధిపత్యం చలాయించింది. కానీ ఆ తర్వాత అదే జోరు కొనసాగించలేక పోయింది. 11-9, 3-11, 17-15, 7-11, 4-11 తేడాతో చైనా క్రీడాకారిణి లీ ప్రపంచ నాలుగో ర్యాంకరే కాకుండా రియోలో రజత పతక […]

Written By: Suresh, Updated On : August 25, 2021 1:45 pm
Follow us on

పారాలింపిక్స్ లో భారత టేబుల్ టెన్నిస్ క్రీడాకారులు ఓటమితో తమ ప్రస్థానం ఆరంభించారు. ప్యాడ్లర్లు భావినాబెన్ పటేల్, సోనాల్ బెన్ మనుభాయి పటేల్ తొలి రౌండ్లలో ఓటమి పాలయ్యారు. మహిళల క్లాస్-3 విభాగంలో పోటీపడ్డ సోనాల్ బెన్ మొదటి మూడు గేముల్లో ఆధిపత్యం చలాయించింది. కానీ ఆ తర్వాత అదే జోరు కొనసాగించలేక పోయింది. 11-9, 3-11, 17-15, 7-11, 4-11 తేడాతో చైనా క్రీడాకారిణి లీ ప్రపంచ నాలుగో ర్యాంకరే కాకుండా రియోలో రజత పతక విజేత కావడం గమనార్హం. ఇక మహిళ క్లాస్ -4 విభాగం తొలి పోరులో భావినాబెన్ కు సైతం చైనా అమ్మాయి చేతిలోనే ఓటమి ఎదురైంది.