
ఏపీలో కరోనా కేసులు కాస్త తగ్గాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 63,849 పరీక్షలు నిర్వహించగా 1,461 కేసులు నిర్ధారణ అయ్యాయి. తాజా కేసులతో కలిపి ఇప్పటి వరకు రాష్ట్రంలో 19,85,182 మంది వైరస్ బారిన పడ్డారు. గడిచిన 24 గంటల్లో 15 మంది మరణించారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా మృతుల సంఖ్య 13,564కి చేరింది. 24 గంటల వ్యవధిలో 2,113 మంది బాధితులు కోలుకోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా కోలుకున్న వారి సంఖ్య 19,52,736కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 18,882 యాక్టివ్ కేసులు ఉన్నాయి.