పెద్దపల్లి జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. కమాన్ సెంటర్ దగ్గర వేగంగా దూసుకువచ్చిన లారీ బైక్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ వెళ్తున్న ఏఎస్ఐ భాగ్యలక్ష్మి అక్కడికక్కడే మృతి చెందగా భాగ్యలక్ష్మి కుమార్తెకు తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు గాయాలైన బాధితురాలిని ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.