Ritabrata Banerjee : రితబ్రత బెనర్జీ.. ఈ పేరు ఎప్పుడూ వినుండరు.. పబ్లిక్ గా ఈ పేరు ఎవరికి తెలిసి ఉండదు. 46 ఏళ్ల ఈ టీఎంసీ నేత ప్రస్తుతం ప్రతిపక్ష నాయకుడిగా పశ్చిమ బెంగాల్ లో ఎన్నికయ్యారు. 59 మంది టీఎంసీ ఎమ్మెల్యేలు కలిపి ఎన్నుకున్న యువ నాయకుడు. మే 4న ఫలితమే బెంగాల్ లో ఒక సంచలనం. ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడు రితబ్రత బెనర్జీ ఎన్నికవడం ఒక సంచలనం.. ఈయన చరిత్ర చూస్తే గమ్మత్తుగా ఉంది. పైకి ఎదిగినటువంటి తీరు మాత్రం ఆశ్చర్యం కలిగిస్తోంది.
కాలేజీలో చదువుకున్నప్పుడు స్టూడెంట్ లీడర్ గా ఎదిగి అక్కడ నుంచి ఎస్.ఎఫ్.ఐ సీపీఎం అనుబంధం సంఘంలో యాక్టివ్ గా ఉండేవాడు. 30 ఏళ్లలోపే ఎస్ఎఫ్ఐ అఖిల భారత సంఘం ప్రధాన కార్యదర్శి ఎన్నికయ్యాడు. అప్పటి బెంగాల్ మంత్రి గౌతమ్ దేవ్ కు సన్నిహితుడిగా ఉండి రాజకీయాల్లో ఎదిగాడు. 2008 నుంచి ఎస్ఎఫ్ఐ లీడర్ గా.. జనరల్ సెక్రటరీగా కొనసాగాడు.
2013లో సంచలనమైంది. వెస్ట్ బెంగాల్ ఫైనాన్స్ మినిస్టర్ అమిత్ మిశ్రాను విద్యార్థి నాయకులు కొట్టారు. ఈ దాడిలో రితబ్రత బెనర్జీని అరెస్ట్ చేశారు. దీంతో రితబ్రతను తీసేయ్యకపోగా అతడికి గుర్తింపునిచ్చి నేతలు పైకి తీసుకొచ్చారు. బుద్దదేవ్ భట్టాచార్య, సీతారం ఏచూరికి మరింత ఆకర్షించి వారి దృష్టిలో పడి రాజకీయాల్లో పైకి ఎదిగాడు.
46 ఏళ్ళ రితబ్రత బెనర్జీ బెంగాల్ ప్రతిపక్ష నాయకుడిగా ఎలా ఎదిగాడన్న దానిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు..
