తొలి మ్యాచ్ వర్షం వల్ల రద్దయింది. రెండో మ్యాచ్ లో గెలుపు ముందు బోర్లా పడాల్సి వచ్చింది.. టీమిండి అలా ఓడిపోవడానికి ప్రధాన కారణం రవి బిష్ణోయ్. తన చెత్త బౌలింగ్ తో పరుగులు మాత్రమే కాదు.. టీమ్ ఇండియాకు గెలుపును కూడా దూరం చేశాడు. అతని బౌలింగ్ లో ఇంగ్లాండ్ బ్యాటర్ బెతల్ అత్యంత స్వేచ్ఛగా బ్యాటింగ్ చేశాడు. ఒక దశలో ఐదు వికెట్ల కోల్పోయి ఇబ్బందుల్లో ఉన్న ఇంగ్లాండ్ జట్టును గెలిపించాడు బెతల్. వాస్తవానికి ఈ మ్యాచ్ లో రవి బిష్ణోయ్ మినహా మీద టీమ్ ఇండియా బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ వేశారు. కానీ ఆ అద్భుతాన్ని రవి నాశనం చేశాడు.
ఈ సిరీస్లో మూడో మ్యాచ్ మంగళవారం జరగబోతోంది. ఈ మ్యాచ్ నేపథ్యంలో మేనేజ్మెంట్ రవి బిష్ణోయ్ మీద వేటు వేసినట్టు తెలుస్తోంది. అతడిని పక్కనపెట్టి ప్రసిద్ కృష్ణకు అవకాశం ఇస్తారని తెలుస్తోంది. అతడు ఐర్లాండ్ జట్టు మీద తేలిపోయిన నేపథ్యంలో.. సూర్యాంష్ కు అవకాశం కల్పిస్తారని తెలుస్తోంది. ఎందుకంటే ఇతడు బ్యాటింగ్ చేయగలడు.. బౌలింగ్ కూడా చేయగలడు.. అందువల్ల అతడిని జట్టులోకి తీసుకునే అవకాశం కనిపిస్తోంది. అతడు 4 ఓవర్ల కోటాను విజయవంతంగా వేయగలరు. మరొక శివం కూడా పేస్ బౌలింగ్ వేయగలడు. బ్యాటింగ్ కూడా చేయగలడు. రవి బిష్ణోయ్ బౌలింగ్ లో విఫలం కావడంతో.. మేనేజ్మెంట్ పై అవకాశాలను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.
మూడో మ్యాచ్ ట్రెంట్ బ్రిడ్జి వేదికగా జరుగుతుంది. ఇది బ్యాటర్లకు ఒక స్వర్గం లాంటిది. ఇక్కడ సూర్య వంశీ గనుక సెట్ అయితే పరుగులు ప్రవాహం లాగా వస్తుంటాయి. గత మ్యాచ్లో కెప్టెన్ అయ్యర్.. తిలక్ వేగంగా బ్యాటింగ్ చేశారు. అలాంటప్పుడు మూడో మ్యాచ్లో వీరిద్దరూ మరో మెరుపు ఇన్నింగ్స్ ఆడాల్సిన అవసరం ఉంది. దీనికి తోడు ఈ మ్యాచ్ కచ్చితంగా గెలవాలి. అలా గెలిస్తేనే సిరీస్ మీద ఆశలు సజీవంగా ఉంటాయి.
ఈ మైదానం బ్యాటర్లకు అనుకూలంగా ఉంటుంది కాబట్టి.. టాస్ గెలిచిన జట్టు కెప్టెన్ బ్యాటింగ్ ఎంచుకునే అవకాశం ఉంది.. మైదానం మీద తేమ మామూలుగా ఉండడంతో బంతి స్వింగ్ లేదా బౌన్స్ అవ్వడానికి అవకాశం ఉండదు. ఐదు నుంచి ఏడు ఓవర్లు ముగిసిన తర్వాత స్పిన్నర్లు సత్తా చూపించే అవకాశం ఉంటుందని తెలుస్తోంది. ఇటీవల మ్యాచ్లో కేవలం 14 పరుగులు మాత్రమే చేసిన సూర్య వంశీ.. ఈ మ్యాచ్లో భారీగా పరుగులు చేయాలని అభిమానులు ఆశిస్తున్నారు. అతడు ఓపెనర్ గా రావడం ఖాయం అయిన నేపథ్యంలో.. అతడు గనుక భారీ ఇన్నింగ్స్ ఆడితే టీమ్ ఇండియాకు తిరుగు ఉండదని అభిమానులు అంచనా వేస్తున్నారు.
