దారుణ హత్యకు గురైన బీటెక్ విద్యార్థిని రమ్య కుటుంబ సభ్యులకు ఏపీ హోంమంత్రి మేకతోటి సుచరిత పరామర్శించారు. గుంటూరు జీజీహెచ్ లో కుటుంబ సభ్యులతో ఆమె మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీఎం కేసీఆర్ ప్రకటించిన రూ. 10 లక్షల పరిహారాన్ని మృతురాలి కుటుంబసభ్యులకు సుచరిత అందజేశారు. పట్టపగలే నడిరోడ్డుపై జనం చూస్తుండగానే రమ్యను (20) శనికృష్ణ (24) అనే యువకుడు కత్తితో పొడిచి అత్యంత పాశవికంగా హతమార్చాడు.