హాకీ జట్టు ఆటగాళ్లకు పంజాబ్ భారీ నజరానా

ఒలింపిక్స్ లో జర్మనీని ఓడించి కాంస్య పతకం గెలిచిన భారత పురుషుల హాకీ జట్టు చరిత్ర సృష్టించింది. 41 ఏళ్ల తర్వాత హాకీలో భారత్ కు మరో పతకాన్ని అందించింది. దీంతో టీమిండియాపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ తో పాటు పలువురు రాజకీయ, క్రీడా, సినీ ప్రముఖులు భారత జట్టును అభినందించారు. తాజాగా పంజాబ్ ప్రభుత్వం హాకీ జట్టు ఆటగాళ్లకు భారీ నజరానా ప్రకటించింది. ఆ […]

Written By: Suresh, Updated On : August 5, 2021 1:08 pm
Follow us on

ఒలింపిక్స్ లో జర్మనీని ఓడించి కాంస్య పతకం గెలిచిన భారత పురుషుల హాకీ జట్టు చరిత్ర సృష్టించింది. 41 ఏళ్ల తర్వాత హాకీలో భారత్ కు మరో పతకాన్ని అందించింది. దీంతో టీమిండియాపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ తో పాటు పలువురు రాజకీయ, క్రీడా, సినీ ప్రముఖులు భారత జట్టును అభినందించారు. తాజాగా పంజాబ్ ప్రభుత్వం హాకీ జట్టు ఆటగాళ్లకు భారీ నజరానా ప్రకటించింది. ఆ రాష్ట్రానికి చెందిన ఆటగాళ్లకు చెరో కోటి రూపాయల నగదు బహుమతి ఇవ్వనున్నట్లు ప్రకటించింది.