యువతిపై అత్యాచారం కేసులో పురోగతి

గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం సీతానగరంలోని కృష్టా నది పుష్కరఘాట్ లో యువతిపై అత్యాచారం ఘటనలో పోలీసులు పురోగతి సాధించినట్లు తెలుస్తోంది. సీతానగరం ప్రాంతంలో ఉండే పాత నేరస్థులను పోలీసులు విచారిస్తున్నారు. మరికొందరి కదలికలపై నిఘా పట్టారు. ఘటన జరిగిన రోజు వారంతా ఎక్కడున్నారనే అంశంపై ఆరా తీస్తున్నారు. విచారణ జరిపే క్రమంలో ఇద్దరు అనుమానితులు పోలీసులకు చిక్కినట్లు సమాచారం. ఈ విచారణలో పోలీసులకు కీలక సమాచారం లభ్యమైనట్లు తెలుస్తోంది. బాధితురాలు చెప్పిన ఆనవాళ్లు నిందితులకు దగ్గరగా […]

Written By: Suresh, Updated On : June 22, 2021 2:06 pm
Follow us on

గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం సీతానగరంలోని కృష్టా నది పుష్కరఘాట్ లో యువతిపై అత్యాచారం ఘటనలో పోలీసులు పురోగతి సాధించినట్లు తెలుస్తోంది. సీతానగరం ప్రాంతంలో ఉండే పాత నేరస్థులను పోలీసులు విచారిస్తున్నారు. మరికొందరి కదలికలపై నిఘా పట్టారు. ఘటన జరిగిన రోజు వారంతా ఎక్కడున్నారనే అంశంపై ఆరా తీస్తున్నారు. విచారణ జరిపే క్రమంలో ఇద్దరు అనుమానితులు పోలీసులకు చిక్కినట్లు సమాచారం. ఈ విచారణలో పోలీసులకు కీలక సమాచారం లభ్యమైనట్లు తెలుస్తోంది. బాధితురాలు చెప్పిన ఆనవాళ్లు నిందితులకు దగ్గరగా ఉన్నట్లు సమాచారం.