భారత్ రెండో వికెట్ చేజార్చుకుంది. ఓపెనర్ పృథ్వీ షా (49) ఔటయ్యాడు. దసున్ శనక వేసిన 15.5వ బంతికి ఎల్బీ అయ్యాడు. ఆడాలా వద్దో అని భావిస్తూ అతడు బ్యాక్ ఫుట్ తీసుకున్నాడు. అంతలోనే బంతి అతడి ప్యాడ్లను తాకేసింది. అంపైర్ ఔట్ ఇచ్చాడు. పృథ్వీ సమీక్ష కోరినా ఫలితం లేకపోయింది. అతడు అర్ధశతకం ముందు ఔటవ్వడం ఇది రెండో సారి. 113/2 తో ఆడుతోంది.