ఆర్థిక రాజధాని ముంబైలో ని ఓషివారా ప్రాంతంలోని ఓ భవనంలో శుక్రవారం ఉదయం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ సిబ్బంది సంఘటనా స్థలానికి ఎనిమిది ఫైర్ ఇంజిన్లను తరలించి మంటలను అదుపులోకి తసుకువచ్చేందుకు చర్యలు చేపట్టారు. మరో ఎనిమిది వాటర్ ట్యాంకర్లను తరలించారు. అంబులెన్స్ ను అందుబాటులో ఉంచగా రెస్క్యూ ఆపరేషన్ జరుగుతోంది. ఓషివారా రిలీఫ్ రోడ్ లోని ఉన్న ఆషియానా టవర్లోని మొదటి ఫ్లోర్ లో ఉదయం 7.57 గంటల ప్రాంతంలో మంటలు చెలరేగాయి.