కరోనా చికిత్సకు వచ్చి చిక్కిన మావోయిస్టులు

అడవుల్లో ఉండే మావోయిస్టులు కరోనా బారినపడడంతో చికిత్స కోసం ఆస్పత్రికి వచ్చారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే వారిని అదుపులోకి తీసుకున్నారు. అయితే వారికి మెరుగైన వైద్యం అందిస్తామని పోలీసులు ప్రకటించారు. దీనికి సంబంధించిన వివరాలను వరంగల్ నగర పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి వెల్లడించారు. వరంగల్ లో ఇద్దరు మావోయిస్టులను అరెస్ట్ చేసినట్లు చెప్పారు. మరో 12 మంది మావోయిస్టులు ప్రస్తుతం కరోనా వైరస్ తో బాధపడుతున్నట్లు సమాచారం ఉందని కమిషనర్ చెప్పారు.

Written By: Velishala Suresh, Updated On : June 2, 2021 3:28 pm
Follow us on

అడవుల్లో ఉండే మావోయిస్టులు కరోనా బారినపడడంతో చికిత్స కోసం ఆస్పత్రికి వచ్చారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే వారిని అదుపులోకి తీసుకున్నారు. అయితే వారికి మెరుగైన వైద్యం అందిస్తామని పోలీసులు ప్రకటించారు. దీనికి సంబంధించిన వివరాలను వరంగల్ నగర పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి వెల్లడించారు. వరంగల్ లో ఇద్దరు మావోయిస్టులను అరెస్ట్ చేసినట్లు చెప్పారు. మరో 12 మంది మావోయిస్టులు ప్రస్తుతం కరోనా వైరస్ తో బాధపడుతున్నట్లు సమాచారం ఉందని కమిషనర్ చెప్పారు.