మహాత్మా గంధీ వ్యక్తిగత కార్యదర్శి వి. కల్యాణం (99) మంగళవారం చెన్నైలో కన్నుమూశారు. స్వాతంత్య్ర సమరయోదుడైన కల్యాణం, 1943 నుంచి 1948వరకు మహాత్మాగాంధీ వ్యక్తిగత కార్యదర్శిగా పరిచేశారు. చెన్నైలోని కుమార్తె ఇంట్లో ఉంటున్న ఆయన వయోభారం, అనారోగ్య సమస్యలతో మంగళవారం రాత్రి కన్నుమూశారు. బుధవారం చెన్నై బీసెంట్ నగర్ శ్మశానవాటికలో అంత్యక్రియలు జరగనున్నాయి.