యూపీలో లాక్ డౌన్ సడలింపులు

రోజువారీ కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మహమ్మారి కట్టడికి విధించిన లాక్ డౌన్ ను జూన్ 1 నుంచి క్రమంగా సడలించనున్నట్లు ప్రకటించింది. తొలుత 600 కంటే తక్కువ క్రియాశీలక కేసులు ఉన్న జిల్లాలు, నగరాల్లో కఠిన ఆంక్షల నుంచి మినహాయింపు ఇవ్వాలని నిర్ణయించింది. ఆయా జిల్లాల్లో వారంలో ఐదు రోజులు అన్ని దుకాణాలు, మార్కెట్లు అనుమతించనుంది. వారాంతంలో మాత్రం కర్ఫ్యూ కొనసాగుతుందని స్పష్టం చేసింది.

Written By: Velishala Suresh, Updated On : May 30, 2021 6:49 pm
Follow us on

రోజువారీ కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మహమ్మారి కట్టడికి విధించిన లాక్ డౌన్ ను జూన్ 1 నుంచి క్రమంగా సడలించనున్నట్లు ప్రకటించింది. తొలుత 600 కంటే తక్కువ క్రియాశీలక కేసులు ఉన్న జిల్లాలు, నగరాల్లో కఠిన ఆంక్షల నుంచి మినహాయింపు ఇవ్వాలని నిర్ణయించింది. ఆయా జిల్లాల్లో వారంలో ఐదు రోజులు అన్ని దుకాణాలు, మార్కెట్లు అనుమతించనుంది. వారాంతంలో మాత్రం కర్ఫ్యూ కొనసాగుతుందని స్పష్టం చేసింది.