యూపీలో పెరుగుతున్న కరోనా కేసుల నియంత్రణకు మే 17న ఉదయం 7 గంటల వరకు లాక్ డౌన్ పొడిగిస్తున్నట్లు సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రకటించారు. ఈ సమయంలో నిబంధనలను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కాగా గ్రామాల్లో టీకాలు వేయడం, పరిశుభ్రతా చర్యలు చేపట్టడం వేగవంతం చేయాలని ప్రభుత్వం అన్ని జిల్లాల అధికారులను ఆదేశించింది. లాక్ డౌన్ సమయంలో నిత్యావసర వస్తువుల దుకాణాలు, మందుల దుకాణాలతోపాటు ఈ-కామర్స్ సంస్థలు పనిచేయనున్నాయి.