
తమిళనాడులో మరో వారం రోజుల పాటు ప్రభుత్వం లాక్ డౌన్ పొడగించింది. ప్రస్తుతం కొనసాగుతున్న లాక్ డౌన్ ఈ నెల 7న ఉదయం 6 గంటలతో ముగియనుంది. ప్రస్తుతం వైరస్ ఉధృతి కొనసాగుతున్న నేపథ్యంలో 14వ తేదీ ఉదయం 6 గంటల వరకు పొడగిస్తూ సీఎం ఎంకే స్టాలిన్ ఆదేశాలు జారీ చేశారు. వైరస్ వ్యాప్తి తక్కువ ఉన్న పలు జిల్లాలకు సడలింపులు ప్రకటించారు. షాపింగ్ కాంప్లెక్స్, సెలూన్ షాపులు రాష్ట్ర వ్యాప్తంగా మూసి ఉంచనున్నారు.