ఎంపీ విజయసాయిరెడ్డి, జగతి పబ్లికేషన్స్ కు మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు లీగల్ నోటీసులు పంపారు. అలాగే సజ్జల రామకృష్ణారెడ్డి, సీనియర్ జర్నలిస్టు రామచంద్రమూర్తితో సహా ఏడుగురికి పరువునష్టం నోటీసులిచ్చారు. ఎన్నికల్లో రూ. 50 కోట్ల తరలింపునకు ఎస్కార్డ్ ఇచ్చారనే ఆరోపణపై ఏబీవీ ఈ దావా వేశారు. ఈ ఆరోపణలపై బహిరంగ క్షమాపణలు చెప్పాలని కోరారు. లేదంటే రూ. కోటి పరువునష్టం దావా కేసు వేస్తానని నోటీసుల్లో పేర్కొన్నారు.