WHO.. కోవిడ్ మరణాలు మూడు రెట్లు ఎక్కువ

కరోనా వైరస్ ప్రపంచ దేశాలను పట్టిపీడిస్తున్న విషయం తెలిసిందే. ఆ మహమ్మారి వల్ల గత ఏడాది కాలంలో లక్షలాది మంది ప్రాణాలు విడిచారు. అమెరికాకు చెందిన జాన్స్ హాప్కిన్స్ కోవిడ్ డేటా ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు 35 లక్షల మంది మరనించారు. సుమారు 17 కోట్ల మందికి వైరస్ సంక్రమించింది. అమెరికాలో 33.0 లక్షల మందికి వైరస్ సోకగా 5.88 లక్షల మంది మరణించారు. ఇండియాలో 26 లక్షల పాజిటివ్ కేసులు నమోదు కాగా 2.90 […]

Written By: Suresh, Updated On : May 21, 2021 3:30 pm
Follow us on

కరోనా వైరస్ ప్రపంచ దేశాలను పట్టిపీడిస్తున్న విషయం తెలిసిందే. ఆ మహమ్మారి వల్ల గత ఏడాది కాలంలో లక్షలాది మంది ప్రాణాలు విడిచారు. అమెరికాకు చెందిన జాన్స్ హాప్కిన్స్ కోవిడ్ డేటా ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు 35 లక్షల మంది మరనించారు. సుమారు 17 కోట్ల మందికి వైరస్ సంక్రమించింది. అమెరికాలో 33.0 లక్షల మందికి వైరస్ సోకగా 5.88 లక్షల మంది మరణించారు. ఇండియాలో 26 లక్షల పాజిటివ్ కేసులు నమోదు కాగా 2.90 లక్షల మంది మరణించారు. అయితే ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇవాల ఒ ప్రకటన చేసింది. ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్ వల్ల సంభవించిన మరణాల సంఖ్య అధికారిక లెక్కల కన్నా మూడు రెట్లు అధికంగా ఉంటుందని డబ్ల్యూహెచ్ వో పేర్కొన్నది.