https://oktelugu.com/

Afghanistan: కాబూల్ లో చిక్కుకున్న 36 మంది కేరళవాసులు

ఆఫ్ఘనిస్థాన్ లోని కాబూల్ లో 36 మంది కేరళవాసులు చిక్కుకున్నట్లు తెలుస్తోంది. వారందర్నీ సురక్షితంగా భారత్ కు తీసుకురావాలని కేరళ ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. కేరళ రాష్ట్రానికి చెందిన ఎన్ఆర్ఐ సంస్థకు.. కాబూల్ నుంచి ఫోన్ కాల్స్ వస్తున్నాయని, ఆ నగరంలో 36 మంది కేరళీయులు చిక్కుకున్నట్లు తెలుస్తోందని విజయన్ ప్రభుత్వం తెలిపింది. ఈ నేపథ్యంలో విదేశాంగశాఖకు ఆ రాష్ట్ర ప్రభుత్వం ఓ లేఖను కూడా సమర్పించింది. నార్కాసంస్థ తమ వద్ద ఉన్న సమాచారాన్ని కేంద్రానికి చేరవేసింది.

Written By:
  • Velishala Suresh
  • , Updated On : August 17, 2021 / 05:31 PM IST
    Follow us on

    ఆఫ్ఘనిస్థాన్ లోని కాబూల్ లో 36 మంది కేరళవాసులు చిక్కుకున్నట్లు తెలుస్తోంది. వారందర్నీ సురక్షితంగా భారత్ కు తీసుకురావాలని కేరళ ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. కేరళ రాష్ట్రానికి చెందిన ఎన్ఆర్ఐ సంస్థకు.. కాబూల్ నుంచి ఫోన్ కాల్స్ వస్తున్నాయని, ఆ నగరంలో 36 మంది కేరళీయులు చిక్కుకున్నట్లు తెలుస్తోందని విజయన్ ప్రభుత్వం తెలిపింది. ఈ నేపథ్యంలో విదేశాంగశాఖకు ఆ రాష్ట్ర ప్రభుత్వం ఓ లేఖను కూడా సమర్పించింది. నార్కాసంస్థ తమ వద్ద ఉన్న సమాచారాన్ని కేంద్రానికి చేరవేసింది.