Homeఆంధ్రప్రదేశ్‌YS Jagan Mohan Reddy : జగన్ తో ప్రశ్న రావణ్ కొలీగ్ గగన.. గన్నవరం...

YS Jagan Mohan Reddy : జగన్ తో ప్రశ్న రావణ్ కొలీగ్ గగన.. గన్నవరం ఎయిర్ పోర్ట్ లో ఏం జరిగింది..

YS Jagan Mohan Reddy : రాజ ద్రోహం కేసులో అరెస్టయి జైల్లో ఉన్న రావణ్.. అలియాస్ జోసెఫ్ కు సంబంధించి ఏదో ఒక వార్త మీడియాలో కనిపిస్తూనే ఉంది. ఇటీవల కాలంలో జోసెఫ్ కు వైసీపీ అధినేత జగన్ బహిరంగంగానే మద్దతు పలికారు. చంద్రబాబును.. పవన్ కళ్యాణ్ ను వ్యక్తిగతంగా టార్గెట్ చేసి విమర్శలు చేసిన జోసెఫ్ ను జగన్ సమర్థించారు. పైగా ఆయనను అరెస్ట్ చేయడానికి ఖండించారు. దీంతో రావడం వెనక ఎవరు ఉన్నారు అనే దానిమీద క్లారిటీ వచ్చిందని టిడిపి నేతలు అంటున్నారు.

రావణ్ అరెస్టు తర్వాత అతని భార్య తెర మీదకి వచ్చింది. కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ఆమెను ఇంటర్వ్యూ చేశాయి. పవన్ కళ్యాణ్ మీద రావణ్ సతీమణి విమర్శలు చేసింది. రావణ్ కేసును విచారిస్తున్న పోలీసులకు సంచలన నిజాలు తెలుస్తున్నాయి. ఆయన ఫోన్లో బూతు వీడియోలు ఉన్నాయని.. దేశ వ్యతిరేక శక్తులకు సంబంధించిన సమాచారం.. కీలక విషయాలు అందులో ఉన్నాయని పోలీసులు ప్రకటించారు. ఆ బూతు వీడియోల ద్వారా రావణ్ అనేకమంది అమ్మాయిలను వేధించాడని.. ఇబ్బంది పెట్టాడని తెలుస్తోంది. సుమారు పది మంది మహిళలు అతడి బాధితులని సమాచారం.

రావణ్ వ్యవహారం ఇలా సాగుతుండగానే.. మరొక కీలక విషయం బయటకు వచ్చింది. రావణ్ తో పాటు ప్రశ్న బృందంలో పనిచేసే గగన అనే అమ్మాయి గన్నవరం విమానాశ్రయానికి వచ్చింది. రావణ్ అరెస్ట్ అయిన తర్వాత గగన పవన్ కళ్యాణ్ మీద వ్యక్తిగతంగా విమర్శలు చేసిన విషయం తెలిసిందే. ఆమెకు కొంతమంది సంఘీభావంగా నిలబడిన విషయం కూడా తెలిసిందే. అయితే గగన గన్నవరం విమానాశ్రయంలో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిని కలిసింది. గగన ను చూడగానే జగన్ వెనక్కి వచ్చారు. ఆమె నెత్తి మీద చేయి వేసి ఆశీర్వదించారు. అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఆ సమయంలో జగన్ వెంట దేవినేని అవినాష్ ఉన్నారు. గగన కొంతకాలంగా వైసీపీకి అనుకూలంగా మాట్లాడుతోంది. కూటమినేతలపై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తోంది. ప్రశ్న బృందం వెనుక జగన్మోహన్ రెడ్డి ఉన్నాడని ఎప్పటినుంచో టిడిపి నేతలు చెబుతున్నారు. గగన జగన్మోహన్ రెడ్డిని కలవడం.. అతడు ఆమెను ఆశీర్వదించడం.. కొద్దిసేపు మాట్లాడటం వంటి పరిణామాలు గన్నవరం విమానాశ్రయంలో చోటు చేసుకున్న నేపథ్యంలో టిడిపి నేతలు అసలు విషయాలను వెల్లడిస్తున్నారు. ప్రశ్న బృందాన్ని వైసిపి నేతలు పెంచి పోషించారని.. కూటమి నేతల పై ఉసిగొల్పారని టిడిపి నేతలు ఆరోపిస్తున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular