కేకేఆర్ కెప్టెన్ గా మళ్లీ దినేశ్ కార్తిక్

కరోనా కారణంగా అర్ధంతరంగా అగిపోయిన ఐపీఎల్ 2021 సీజన్ లోని మిగతా మ్యాచ్ లను యూఏఈ వేదికగా నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయంచింది. రెండో దశలో ఆస్ట్రేలియా క్రికెటర్లు ఆడతారా లేదా అన్న విషయం అనుమానంగా మారింది. మరోవైపు ఇంగ్లాండ్ క్రికెటర్లు ఐపీఎల్ లో ఆడకపోవచ్చని తెలుస్తోంది. ఐపీఎల్ లో కోల్ కతా నైట్ రైడర్స్ జట్టుకు ఇంగ్లాండ్ వన్డే కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ సారథిగా వ్యవహరిస్తున్నాడు. ఒకవేళ మోర్గాన్ అందుబాటులో లేకపోతే జట్టు కెప్టెన్సీ బాధ్యతలను మళ్లీ […]

Written By: Suresh, Updated On : May 29, 2021 2:58 pm
Follow us on

కరోనా కారణంగా అర్ధంతరంగా అగిపోయిన ఐపీఎల్ 2021 సీజన్ లోని మిగతా మ్యాచ్ లను యూఏఈ వేదికగా నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయంచింది. రెండో దశలో ఆస్ట్రేలియా క్రికెటర్లు ఆడతారా లేదా అన్న విషయం అనుమానంగా మారింది. మరోవైపు ఇంగ్లాండ్ క్రికెటర్లు ఐపీఎల్ లో ఆడకపోవచ్చని తెలుస్తోంది. ఐపీఎల్ లో కోల్ కతా నైట్ రైడర్స్ జట్టుకు ఇంగ్లాండ్ వన్డే కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ సారథిగా వ్యవహరిస్తున్నాడు. ఒకవేళ మోర్గాన్ అందుబాటులో లేకపోతే జట్టు కెప్టెన్సీ బాధ్యతలను మళ్లీ దినేశ్ కార్తీక్ కు అప్పగించే అవవాశాలున్నాయి. ప్రస్తుతం కార్తీక్ వైస్ కెప్టెన్ గా ఉన్నాడు. గత సీజన్ మధ్య వరకు దినేష్ కోల్ కతాకు కెప్టెన్ గా వ్యవహరించాడు. జట్టు వరుస వరుస పరాజయాల నేపథ్యంలో అతడ్ని సారిథిగా తప్పించారు.