Homeవార్త విశ్లేషణCRISIL Report: పెరిగిన శాకాహారం ధర.. తగ్గిన మాంసాహారం ధర

CRISIL Report: పెరిగిన శాకాహారం ధర.. తగ్గిన మాంసాహారం ధర

CRISIL Report: నిత్యావసర సరుకుల ధరలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ రేటింగ్‌ ఏజెన్సీ క్రిసిల్‌ తాజాగా కీలక డేటాను విడుదల చేసింది. ఇంట్లోని శాకాహార భోజనానికి అయ్యే ఖరు‍్చ 7 శాతం పెరిగి రూ.27.3కు చేరిందని తెలిపింది. గతేడాది ఇదే ధర రూ.25.5గా ఉండేదని పేర్కొంది. ఇక మాంసాహార భోజనం ధర మాత్రం 7 శాతం తగ్గింది. గతేడాది దీని ధర రూ.59.2 ఉండగా, ప్రస్తుతం 54.9గా నమోదైందని క్రిసిల్‌ నివేదించింది.

ద్రవ్యోల్బణం కారణంగా..
ద్రవో‍్యల్బణం కారణంగా వంటిల్లు నిర‍్వహణ భారంగా మారుతోంది. గతేడాదితో పోలిస్తే వ్యయం పెరిగింది. ఏడాది ప్రాతిపదికన ఉల్లిగడ్డలు 46 శాతం, టమాటాలు 36 శాతం, బంగాళా దుంపలు 22 శాతం పెరగడంతో వెజ్‌ భజనంన ధర పెరిగింది. గతేడాది మార్కెట్‌లో ఉలి, బంగాళా దుంపలు, టమాటా కొరత ఏర్పడి ధలు భారీగా పరిగాయి. దీంతోపాటు బియ‍్యం ధరలు 14 శాతం, పప్పుల ధరలు 22 శాతం పెరిగాయి. ఇక ఇదే సమయంలో మాంసం ధర 16 శాతం పడిపోయింది. దీంతో మార్చిలో భోజనానికి ఖర్చు తగ్గింది.

ధరల్లో వ్యత్యాసం..
క్రిసిల్ మార్కెట్ ఇంటెలిజెన్స్ అండ్ అనలిటిక్స్ రీసెర్చ్ డైరెక్టర్ పూషన్‌శర్మ మాట్లాడుతూ.. ఐదు నెలలుగా శాకాహార, మాంసాహార భోజనం ధరల్లో వ్యత్యాసం కనిపిస్తోందన్నారు. మాంసహారం ధర పడిపోయి, కాయగూరల ధరలు, నిత్యావసర సరుకుల ధరల పెరగడమే ఇందుకు కారణమని పేర్కొన్నారు. దేశంలో ముడి సరుకు ధరలు ఐదు శాతం పెరగడంతో ఫిబ్రవరితో పోలిస్తే మార్చిలో నాన్‌వెజ్‌ భోజనం ధర రెండు శాతం పెరిగిందన్నారు. రంజాన్ మాసంలో మాంసాహారానికి డిమాండ్ ఎక్కువగా ఉంటుందని తెలిపారు. పశుగ్రాసం ధర కూడా అధికమైంది. సమీప భవిష్యత్తులో తాజా పంట మార్కెట్‌లోకి వస్తే గోధుమల ధరలు తగ్గుతాయని వివరించారు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Exit mobile version