Homeఆధ్యాత్మికంHoroscope Today: ఈ రాశి వారికి శ్రమకు తగిన ఫలితం ఉంటుంది..

Horoscope Today: ఈ రాశి వారికి శ్రమకు తగిన ఫలితం ఉంటుంది..

Horoscope Today: 2025 మే 3 శుక్రవారం రోజున ద్వాదశ రాశులపై శతబిషా నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈరోజు చంద్రుడు కుంభ రాశిలో సంచరించనున్నాడు. దీంతో ఓ రాశి వారికి శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. మరో రాశి ఉద్యోగులు వ్యాపార ఒప్పందాలు చేసుకుంటారు. మేషం నుంచి మీనం వరకు 12 రాశుల వారి ఫలితాలు ఏవిధంగా ఉన్నాయో చూద్దాం..

మేషరాశి:
ఈ రాశి వ్యాపారులకు కొంత అనిశ్చితి ఉంటుంది. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఖర్చులను తగ్గించుకోవడం మంచిది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొంటారు.

వృషభ రాశి:
ఆరోగ్యపరమైన సమస్యలపై దృష్టి పెట్టాలి. వ్యాపార ఒప్పందాలలో ఆలోచనాత్మకంగా వ్యవహరించాలి. ఒత్తిడికి లోను కాకుండా ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నించాలి.

మిథునం:
కొన్ని సంఘటనలు సంతోషాన్ని ఇస్తాయి. లక్ష్యంపై దృష్టి పెడుతారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా ఉంటారు.

కర్కాటకం:
ఉద్యోగులు కార్యాలయాల్లో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు. శ్రమకు తగిన ఫలితాలు ఉంటాయి. కొత్త వ్యక్తులను కలుసుకుంటారు. ఇతరులతో ఎక్కువగా వాగ్వాదానికి దిగకూడదు.

సింహ:
జీవిత భాగస్వామి నుంచి పూర్తి మద్దతు ఉంటుంది. కొత్త వ్యక్తులను అంతగా నమ్మొద్దు. పెండింగులో ఉన్న సమస్యలు పరిష్కారం అవుతాయి. వ్యాపారులు పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

కన్య:
ఇతరుల ప్రయోజనాలు చూస్తారు. పిల్లల కెరీర్ పై దృష్టి పెడుతారు. కుటుంబ సమస్యల పరిష్కారానికి మార్గం దొరుకుతుంది. కొత్త వాహనం కొనుగోలు చేస్తారు.

తుల:
కొన్ని ప్రత్యేక కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారులు అనుకున్న పనులను నెరవేర్చుకుంటారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఉద్యోగులు ప్రశాంతమైన జీవితం గడుపుతారు.

వృశ్చికం:
ఇతరుల నుంచి బహుమతులు స్వీకరిస్తారు. బయటి వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలి. ఏ పని చేసినా ఇతరుల సాయం తీసుకోవాలి. కుటుంబ వాతావరణం ఆహ్లాదంగా ఉంటుంది.

ధనస్సు:
వాగ్దానాలను నెరవేరుస్తారు. కొన్ని ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి. ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తారు.ఉద్యోగులు కార్యాలయాల్లో బిజీగా ఉంటారు.

మకర:
ఖర్చులపై నియంత్రణ ఉండాలి. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు. దూర ప్రయాణాలు చేస్తారు. నిర్ణయాలు తీసుకునేటప్పుడు తొందరపడొద్దు.

కుంభం:
ఆదాయం పెరుగుతుంది. ముఖ్యమైన విషయాల్లో ఆందోళనతో ఉంటారు. సకాలంలో పనులు పూర్తి చేయండి. స్నేహితులతో కలిసి విహార యాత్రకు వెళ్తారు.

మీనం:
కొత్త వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు. కొత్తవారికి డబ్బు ఇచ్చేటప్పుడు ఆలోచించాలి. ఖర్చులపై నియత్రణ ఉండాలి.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.
Exit mobile version