Homeజాతీయం - అంతర్జాతీయంహాకీలో చిత్తుగా ఓడిపోయిన భారత్

హాకీలో చిత్తుగా ఓడిపోయిన భారత్

టోక్యో ఒలింపిక్స్ లో భారత హాకీ జట్టు ఆదివారం ప్రపంచ నంబర్ వన్ టీమ్ ఆస్ట్రేలియా చేతిలో ఘోర పరాభావం పాలైంది. పూల్-ఏలోని రెండో మ్యాచ్ లో టీమ్ ఇండియా 1-7 తేడాతో ఓటమిపాలైంది. ఈ మ్యాచ్ లో ఆది నుంచి ఆదిపత్యం చెలాయించిన ఆస్ట్రేలియా ఏ దశలోనూ భారత్ కు అవకాశమివ్వలేదు. దాంతో భారత్ పై సునాయాస విజయం సాధించింది. దీంతో ఆస్ట్రేలియా ఒలింపిక్స్ లో వరుసగా రెండో మ్యాచ్ లోనూ గెలుపొందడం గమనార్హం. అంతకుముందు టీమ్ ఇండియా తొలి మ్యాచ్ లో న్యూజిలాండ్ ను 3-2 తేడాతో ఓడించిన సంగతి తెలిసిందే.

Velishala Suresh
Velishala Sureshhttps://oktelugu.com/
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
Exit mobile version