
గోవుల తరలింపుపై తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. సరైన ధృవ పత్రాలు లేకుండా గోవులను నగరంలోకి తరలించేందుకు అనుమతి లేదని స్పష్టం చేసింది. పోలీసులతో పాటు గోరక్ష దళ్ కు చెందిన ఒక వ్యక్తి పోలీస్ చెక్ పోస్ట్ వద్ద వాహనాలు తనిఖీలు చేసేందుకు కోర్ట్ అనుమతి ఇచ్చింది. సరైన ధృువ పత్రాలు లేకుండా పశువులను తరలిస్తున్న వాటిని సీజ్ చేయవచ్చునని, పశువుల తరలింపుపై గో రక్షకులు పోలీసులకు సమాచారం ఇవ్వాలని చెప్పింది. పశువులను అక్రమంగా తరలిస్తున్న వారిపై దర్యాప్తు చేసి కేసులు నమోదు చేయాలని న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది.