
కోర్టు ధిక్కరణ కేసు విచారణ ఖర్చుల కోసం రూ. 58 కోట్ల మంజూరుపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. నిధులు విడుదల చేయవద్దని కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. కోర్టు ధిక్కరణ కేసుల కోసం రూ. 58 కోట్లు మంజూరు చేయడమేంటని హైకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ప్రజాధనం ఎలా ఖర్చు చేస్తారో వివరించాలని, ట్రెజరీ నిబంధనలు ఎలా అనుమతిస్తాయో చెప్పాలని న్యాయస్థానం ప్రశ్నించింది. రెవెన్యూ, ఆర్థిక శాఖల ముఖ్య కార్యదర్శులు, సీసీఎల్ ఏ, ట్రెజరీ డైరెక్టర్ కు నోటీసులిచ్చింది. సీఎస్ సోమేష్ కుమార్ కు వ్యక్తిగత హోదాలో హైకోర్టు నోటీసులిచ్చింది. తదుపరి విచారణ అక్టోబర్ 27కు వాయిదా వేసింది.