Homeఆంధ్రప్రదేశ్‌Greater Visakhapatnam Elections 2026: గ్రేటర్ విశాఖపై కూటమి.. టార్గెట్ ఫిక్స్!

Greater Visakhapatnam Elections 2026: గ్రేటర్ విశాఖపై కూటమి.. టార్గెట్ ఫిక్స్!

Greater Visakhapatnam Elections 2026: సాధారణంగా ఉత్తరాంధ్ర ( North Andhra )అంటే తెలుగుదేశం పార్టీ అధిపత్యముంటుంది. ఒకటి రెండు సార్లు తప్పించి ఆ పార్టీదే హవా. విశాఖ నగరం గురించి చెప్పనవసరం లేదు. తెలుగుదేశం పార్టీకి ఆ నగరం కంచుకోట. కానీ ఒక విషయంలో మాత్రం తీరని లోటు. గ్రేటర్ విశాఖపట్నం మాత్రం ఆ పార్టీకి చిక్కలేదు. అప్పుడెప్పుడో ఐదేళ్లపాటు మాత్రం ఆ పార్టీ గ్రేటర్ విశాఖ ను ఏలింది. కానీ తరువాత మాత్రం చిక్కలేదు. ఇటీవల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి మేయర్ పదవిని స్వాధీనం చేసుకుంది. వచ్చే ఎన్నికల్లో మరోసారి గెలిచి గ్రేటర్ పీఠాన్ని దక్కించుకోవాలని చూస్తోంది. అయితే టిడిపి తో పాటు మిత్రపక్షాలైన జనసేన, బిజెపి సైతం విశాఖపట్నం పీఠాన్ని ఆశిస్తున్నాయి. ఆ దిశగా పావులు కదుపుతున్నాయి.

* అతిపెద్ద కార్పొరేషన్..
రాష్ట్రంలోనే అతిపెద్ద కార్పొరేషన్ విశాఖపట్నం( Visakhapatnam). 98 డివిజన్లతో గ్రేటర్ విశాఖ ఉంది. అయితే శివారు ప్రాంతాలను కలుపుతూ 150 డివిజన్లుగా మార్చాలన్న ఆలోచన ఉంది. ముఖ్యంగా భీమిలి, అనకాపల్లిలోని గ్రామీణ మండలాలను కూడా కలుపుతారని ఎప్పటినుంచో టాక్ ఉంది. ఇవన్నీ జీవీఎంసీలో కలిస్తే మరో 25 డివిజన్లు పెరుగుతాయి. జీవీఎంసీని 150 వార్డులుగా పెంచాలన్నది కూటమి ప్రభుత్వ ఆలోచనగా తెలుస్తోంది. అయితే ఈ డివిజన్ల చేర్పుల ప్రక్రియ అంత ఈజీగా తేలేలా లేదు. మరో ఆరు నెలల సమయం పట్టే అవకాశం ఉంది.

* ఎవరికివారుగా..
ఇటీవల అవిశ్వాసం పెట్టి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి మేయర్ పదవిని అందుకుంది టిడిపి. మరోసారి ఆ పదవిని చేజిక్కించుకోవడం ద్వారా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇవ్వాలని భావిస్తోంది. మరోవైపు జీవీఎంసీ మేయర్ పీఠం కోసం కూటమిలో అప్పుడే చర్చ ప్రారంభం అయింది. విశాఖ తొలి మేయర్ పీఠం బిజెపి దక్కించుకుంది. 1987లో టిడిపి గెలిచింది. 1995, 2005,2007 లో వరుసగా మూడుసార్లు కాంగ్రెస్ పార్టీ మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుంది. 2021 లో జరిగిన ఎన్నికల్లో మాత్రం వైసిపి మేయర్ పిఠాన్ని దక్కించుకుంది. నాలుగేళ్లపాటు మేయర్ గా వైసీపీకి చెందిన హరి వెంకట కుమారి కొనసాగారు. గత ఏడాది ఆమెపై అవిశ్వాస తీర్మానం పెట్టి పదవి నుంచి దించేశారు. తెలుగుదేశం పార్టీకి చెందిన శ్రీనివాస్ రావు మేయర్ అయ్యారు. ఏడాది మార్చుతో జీవీఎంసీ పాలకవర్గం పదవీకాలం పూర్తి కానుంది.

* యాదవ సామాజిక వర్గం డిమాండ్..
విశాఖ నగరంలో యాదవ సామాజిక వర్గం అధికం. ఆ సామాజిక వర్గం వారు పెద్ద సంఖ్యలో ఉన్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సామాజిక కోణంలోనే యాదవ వర్గానికి చెందిన హరి కుమారిని నియమించింది. అయితే ఇప్పుడు ఆమెను తొలగించి శ్రీనివాసరావు అయ్యారు మేయర్ గా. ఈసారి మాత్రం యాదవ సామాజిక వర్గానికి చెందిన వారికి మేయర్ పదవి కట్ట పెట్టాలన్న డిమాండ్ టిడిపి నుంచి వినిపిస్తోంది. ఇంకోవైపు కాపులు, మత్స్యకారులు, నాగవంశీయులు కూడా మేయర్ పీఠానికి పోటీ పడుతున్నారు.. జనసేన సైతం ఇక్కడ మేయర్ పీఠాన్ని ఆశిస్తోంది. బిజెపికి సైతం విశాఖ నగరంలో బలం ఉంది. దీంతో మేయర్ పదవిని రెండున్నర ఏళ్ల పాటు పంచాలని.. డిప్యూటీ మేయర్ పదవులను మూడు పార్టీలు సమానంగా పంచుకోవాలని ప్రతిపాదనలు వస్తున్నాయి. చూడాలి గ్రేటర్ విషయంలో కూటమి ఎలా ముందుకు వెళ్తుందో..

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Most Popular

Samsung Galaxy S26 FE: శామ్‌సంగ్ అభిమానులకు గుడ్‌న్యూస్.. ఈ రెండు త్వరలోనే మార్కెట్లోకి..

Samsung Galaxy S26 FE: ప్రముఖ టెక్ దిగ్గజం Samsung నుంచి కొత్త ఫోన్ మార్కెట్లోకి వస్తుందంటే చాలా మంది ఆసక్తి చూపుతూ ఉంటారు. అయితే ఆకర్షణీయమైన టాబ్లెట్ లను కూడా తీసుకువచ్చి...

Cockroach Janata Party : కాక్రోచ్ జనతా పార్టీ ఢిల్లీ బలప్రదర్శన బలమా వాపా?

ఢిల్లీ వేదికగా జరిగిన కాక్రోచ్ జనతా పార్టీ బలప్రదర్శన దేశ రాజకీయాల్లో పెద్ద చర్చకు దారితీసింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ప్రారంభమైన ఈ ఉద్యమం, 23 రోజుల నిరాహార దీక్ష...

Balakrishna Injury: బాలయ్యకు తీవ్ర గాయాలు.. జూనియర్ ఎన్టీఆర్ షాకింగ్ ట్వీట్ వైరల్..

Balakrishna Injury: నేడు కాకినాడ లో నందమూరి బాలకృష్ణ NBK111 షూటింగ్ జరుగుతుండగా , యాక్షన్ సన్నివేశం చిత్రీకరణ సమయంలో బాలయ్య కి మజిల్ టియర్ అవ్వడం తో ఆయన్ని వెంటనే హాస్పిటల్...

Tollywood Directors: బాలీవుడ్ హీరోలతో సినిమాలు చేసే ఉద్దేశ్యం లేని తెలుగు దర్శకులు వీళ్లే…

Tollywood Directors: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న స్టార్ డైరెక్టర్లు కొందరు తెలుగు హీరోలు అవకాశం ఇవ్వకపోవడంతో బాలీవుడ్ హీరోలతో సినిమాలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ముఖ్యంగా వంశీ పైడిపల్లి తెలుగు స్టార్...

Vemulawada Rajanna Temple: వేములవాడకు తండ్రి 7 లక్షల విరాళం.. తిరిగివ్వాలని కూతుళ్ల పోరాటం.. ఊహించని ట్విస్ట్

Vemulawada Rajanna Temple: తెలంగాణలో ప్రముఖ శైవ క్షేత్రాలలో అత్యంత ప్రసిద్ధి చెందింది వేములవాడ రాజేశ్వర ఆలయం. ఇక్కడ స్వామి వారు లింగం రూపంలో ఉంటారు. ఈ ఆలయంలో కోడె మొక్కులను చెల్లించడం...
Oktelugu Epaper
Exit mobile version