హామీల అమలులో ప్రభుత్వం విఫలమైందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. ఏపీలో రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న సంస్థాగత సమావేశాలలో భాగంగా, ఈరోజు ఉదయం రాజమహేంద్రవరం పార్లమెంటు జిల్లా సమావేశాన్ని నిర్వహించారు. సమావేశంలో బీజేపీ ఏపీ ప్రధాన కార్యదర్శి లోకుల గాంధీ, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు శ్రీమతి రేలంగి శ్రీదేవి, జిల్లా అధ్యక్షుడు పరిమి రాధ, తదితరులు పాల్గొన్నారు. సమావేశంలో భాగంగా పార్టీ సంస్థాగత విషయాలు, భవిష్యత్ కార్యక్రమాలు, స్థానిక ప్రజా సమస్యలపై చర్చించారు.